యాప్నగరం

Bhupalpally: మరో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మృతి.. దైవదర్శనానికి కాలినడకన వెళ్తుండగా..

Bhupalpally: భద్రాది కొత్తగూడెం పారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హాత్య ఘటన మరవక ముందే మరో అటవీ అధికారులు మరణించారు. జగిత్యాల జిల్లాకు చెందిన అధికారి తిరుపతికి వెళ్లి అక్కడ ప్రాణాలు విడవటం విషాదకరం. అయితే.. కుటుంబసభ్యులతో కలిసి వెంకన్న దర్శనానికి కాలినడకన వెళ్తున్న అధికారికి.. అలిపిరి మార్గంలో ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే ఆ అధికారి ప్రాణాలు విడిచారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 25 Nov 2022, 10:34 pm

ప్రధానాంశాలు:

  • భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ డిప్యూటీ రేంజ్ అధికారి మృతి
  • తిరుపతిలో వెంకన్న దర్శనానికి వెళ్తున్న సాయిప్రసాద్‍‌కు గుండెపోటు
  • ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు వదిలిన సాయిప్రసాద్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Heart Attack
Bhupalpally: భద్రాద్రి కొత్తగూడెంలో గుత్తికోయల చేతిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు దారుణ హత్యకు గురైన ఘటన మరువక ముందే మరో అటవీ అధికారి మృతి చెందాడు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన సాయి ప్రసాద్.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్ డిప్యూటీ రేంజ్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే.. సాయి ప్రసాద్ కుటుంబంతో పాటు వెంకన్న దర్శనం కోసం తిరుపతి వెళ్లాడు. కాలినడకన కొండ ఎక్కుతానని మొక్కుకున్న సాయి ప్రసాద్.. తన పయాణాన్ని ప్రారంభించారు. అయితే.. అలిపిరి నడకమార్గంలో వెళ్తున్న సాయి ప్రసాద్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు అక్కడున్న సిబ్బంది సహాయంతో.. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచాడు.
సాయి ప్రసాద్ మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. సాయి ప్రసాద్‌‌కు 7ఏళ్ల వయసున్న కొడుకు, ఐదేళ్ల వయసున్న కూతురు ఉన్నారు. సాయి ప్రసాద్ మృతితో కుటుంబసభ్యువు గుండెలవిసేలా రోధిస్తున్నారు. గతంలో వేములవాడ సమీపంలోని రుద్రంగిలో సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన సాయి ప్రసాద్.. నూతన జోనల్ విధానంలో భాగంగా ఈ మధ్యే మహదేవ్‌పూర్‌కు బదిలీ అయినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనానికి వెళ్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకోవటం అందరినీ కలచివేసింది. అందులోనూ.. ఓ అటవీ అధికారి మరణించిన రెండు రోజులకే ఇంకో అటవీ అధికారి మరణించటం మరింత విషాదాన్ని నింపింది.

  • Read More Telangana News and Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.