యాప్నగరం

మహబూబ్‌నగర్: ఇంట్లో 2 కిలోల బంగారం చోరీ.. మూడ్రోజుల్లోనే పెళ్లి

Midjil: బంధువులకు సంబంధించిన బంగారు నగలు, రూ.6 లక్షల నగదును ఇంట్లోని బీరువాలో ఉంచారు. ఇదే అదునుగా అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నగదు, బంగారం దోచుకొని పోయారు.

Samayam Telugu 19 Dec 2020, 2:35 pm
మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం బోయినపల్లి గ్రామంలో భారీ దొంగతనం జరిగింది. త్వరలో ఇంట్లో పెళ్లి ఉండగా అదే ఇంట్లో అతి పెద్ద మొత్తంలో బంగారాన్ని దుండగులు చోరీ చేశారు. బోయినపల్లి గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఈనెల 23న వివాహ కార్యక్రమం ఉంది. దీంతో సమీప బంధువులందరినీ ముందుగానే ఇంటికి పిలిచారు. వారి ఆహ్వానం మేరకు బంధువులు అందరూ ఇంటికి వచ్చారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Theft


ఈ క్రమంలో బంధువులకు సంబంధించిన బంగారు నగలు, రూ.6 లక్షల నగదును ఇంట్లోని బీరువాలో ఉంచారు. ఇదే అదునుగా అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నగదు, బంగారం దోచుకొని పోయారు. దాదాపు రెండు కిలోల బంగారం, రూ.6 లక్షల నగదు చోరీకి గురైందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ శివకుమార్‌ ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్‌ టీమ్‌తో దర్యాప్తు చేపట్టారు. పెళ్లి ఇంట్లో భారీ చోరీ జరగడం స్థానికంగా సంచలనం కలిగించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. క్లూస్ కోసం బాధితులను కూడా ప్రశ్నిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.