యాప్నగరం

బీజేపీలోకి కత్తి కార్తీక..! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ

Telangana BJP: దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి కత్తి కార్తీక పోటీ చేసిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేతలు తనను అనేక విధాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపణలు చేశారు.

Samayam Telugu 21 Nov 2020, 6:59 pm
న్యూస్ ఛానల్ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక త్వరలో బీజేపీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. శనివారం ఆమె తాజాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. చర్చల అనంతరం బీజేపీలో చేరుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమె తన ఫేస్‌బుక్ పేజీలో ఈ విషయాన్ని ప్రకటించారు. తాను కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశానని.. రెండు, మూడు రోజుల్లో పార్టీ మార్పుపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు.
Samayam Telugu కిషన్ రెడ్డిని కలిసిన కత్తి కార్తీక
kathi karthika meets kishan reddy


ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి కత్తి కార్తీక పోటీ చేసిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేతలు తనను అనేక విధాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపణలు గుప్పించారు. ప్రశ్నించే గొంతుకగా ప్రజల్లో నిలవాలన్నదే తన ఆశని తన ప్రచారంలో పేర్కొన్నారు. ఈ ఉపఎన్నికల్లో ఆమె 630 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్లు కోల్పోయారు.

శనివారం ఆమె కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయి చర్చలు జరిపిన అనంతరం కార్తీక పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తాను కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశానని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.