యాప్నగరం

అమీర్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. మెట్రో రెయిలింగ్‌లో తల ఇరుక్కొని..

Hyderabad Metro: ఈ ఘటనలో యువకుడి తల రోడ్డు పక్కనే ఉండే మెట్రో స్టేషన్‌ రెయిలిగ్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Samayam Telugu 11 Dec 2020, 11:11 am
హైదరాబాద్‌లోని అమీర్‌పేట చౌరస్తాలో ఈ తెల్లవారు జామున ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు యువకులు బైక్‌పై అతి వేగంతో కూకట్‌పల్లి వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్దకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పింది. ఈ ఘటనలో యువకుడి తల రోడ్డు పక్కనే ఉండే మెట్రో స్టేషన్‌ రెయిలిగ్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Samayam Telugu తల ఇరుక్కొని చనిపోయిన యువకుడు
Ameerpet accident


అయితే, ప్రమాదం జరిగిన తీరు మాత్రం అంతు చిక్కడం లేదు. యువకుడి తల అత్యంత సన్నగా ఉండే రెయిలింగ్‌లో ఇరుక్కోవడం విస్మయం కలిగిస్తోంది. ప్రమాదం జరగ్గానే ఇలా ఎలా జరిగిందన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.