యాప్నగరం

నిజామాబాద్‌లో ‘రాజకీయాలు’.. నిన్న TRSలోకి జంప్.. ఇవాళ మళ్లీ BJPలోకి..

Nizamabad: అక్టోబరు 9న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు, హైదరాబాద్‌లో మంగళవారం ఎమ్మెల్యే గంప గోవర్థన్ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చాట్ల రాజేశ్వర్ టీఆర్ఎస్‌లో చేరారు.

Samayam Telugu 7 Oct 2020, 7:02 pm
నిజామాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఒక రోజు ముందు కూడా రాజకీయ పరిణామాలు నాటకీయంగా జరుగుతున్నాయి. మంగళవారం టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ కార్పొరేటర్ ఒక్కరోజు కూడా గడవక ముందే మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. మంగళవారం మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో బీజేపీ 44వ డివిజన్ కార్పొరేటర్ బైకాన్ సుధ టీఆర్ఎస్‌లో చేరారు. బుధవారం సాయంత్రానికి మళ్లీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య, రాష్ట్ర నాయకుడు సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో 24 గంటలు గడవక ముందే సుధ సొంత గూటికి చేరారు.
Samayam Telugu మంగళవారం టీఆర్ఎస్ తీర్థం
Nizamabad


nizamabad mlc candidates 2020


అక్టోబరు 9న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు, హైదరాబాద్‌లో మంగళవారం ఎమ్మెల్యే గంప గోవర్థన్ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చాట్ల రాజేశ్వర్ టీఆర్ఎస్‌లో చేరారు. బుధవారం మళ్లీ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలోన మరో ఇద్దరు 19వ వార్డు కౌన్సిలర్ చింతల రవీందర్ గౌడ్, 32 వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ పంపరి లత, టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.