యాప్నగరం

‘ఎన్నికలకు ముందు రైతుబంధు నిధులా.. ఈసీ పట్టించుకోదా?’

TRS పార్టీ నేతలపై బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపణలు కురిపించారు. అధికారులు, పోలీసులు టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని.. విపక్ష పార్టీ అభ్యర్థులను వేధింపులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.

Samayam Telugu 21 Jan 2020, 8:38 pm
ధికారులు, పోలీసులు అధికార టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. కొంత మంది అధికారులు టీఆర్‌ఎస్‌కు ప్రచారకర్తలుగా మారారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి కాన్వాయ్ వాడుతున్నా.. ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్ సర్కార్ ఎన్నికల ముందు రైతుబంధు నిధులు విడుదల చేయడం ఓటర్లను మభ్యపెట్టడమేనని మండిపడ్డారు. మంగళవారం (జనవరి 21) మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Samayam Telugu bandhu


ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి లొంగిపోయిందని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో గౌరవం లేకుండా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పోలీసులు ఎన్నికల సందర్భంగా జరుగుతున్న హింసను చూస్తున్నారే తప్ప ఆపడం లేదని.. విపక్ష పార్టీల అభ్యర్థులకు కనీస భద్రత కూడా కల్పించడం లేదని ఆయన ధ్వజమెత్తారు.

అనేక మున్సిపాలిటీలలో ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలను కొడుతున్నారని.. బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. పోలీసుల అండతోనే అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

‘అధికార పార్టీ నేతలు డబ్బులు, మద్యం పంచుతున్నారని చేసిన ఫిర్యాదులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బీజేపీ అభ్యర్థిపై దాడి చేసిన నిందితులను పట్టుకోలేదు’ అని ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు.

Also Read: కేసీఆర్ సలహాతోనే ఏపీలో 3 రాజధానులు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.