యాప్నగరం

ఉస్మానియా యూనివర్శిటీకి ఎంపీ తేజస్వి సూర్య.. అడ్డుకున్న పోలీసులు

బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అయిన తేజస్వి క్యాంపస్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆయనను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.

Samayam Telugu 24 Nov 2020, 3:33 pm
ఉస్మానియా యూనివర్శిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేపీ యువ మెర్చా జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య ఉస్మానియా యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు వెంటనే ఎన్ సీసీ గేట్ దగ్గర ఆయనను అడ్డుకున్నారు.లోపలికి అనుమతి లేదంటూ పోలీసులు బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆవేశంతో ఉన్న బిజెపి కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. బీజేవైఎం కార్యకర్తలు భారీ సంఖ్యలో ఒక్కసారిగా భారీ కేడ్లు తొలగించి యూనివర్సిటీ లోకి చొర బట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Samayam Telugu ఉస్మానియాలో ఎంపీ తేజస్వి


చివరకు కార్యకర్తల్ని లోపలకు అనుమతించిన పోలీసులు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఓయూ లోపలకు వాహనాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. పోలీసులుకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరగగా వాహనం దిగి నడుచుకుంటూ ఆర్ట్స్ కాళాశాల వద్దకు తేజస్వీ సూర్య వెళ్ళారు. యూనివర్శిటీ వద్ద భారీగా పోలీసు బందో బస్త్ ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.