తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఇటీవల దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జరిగే కీలక విషయాలపై స్పందిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, టీఆర్ఎస్ నాయకులపై తీవ్ర స్వరంతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి ఫేస్బుక్ వేదికగా కేసీఆర్కు ఆమె పలు ప్రశ్నలు సంధించారు. హిందువుల ఓట్లు గుర్తుకొచ్చినప్పుడే కేసీఆర్ యజ్ఞాలు, పూజల పేరుతో హడావుడి చేస్తుంటారని విమర్శించారు.
Also Read: మంచిర్యాల: వ్యవసాయ కూలీగా మారిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్... పొలంలో వరినాట్లు వేస్తూ ‘హిందువుల ఓట్లు గుర్తుకొచ్చినప్పుడల్లా యజ్ఞాలు, పూజలు, స్వాములతో మంతనాలలో మునిగితేలే కేసీఆర్ గారికి గోమాత మాత్రం దైవంగా కనిపించదు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలన్న లక్ష్యంతో ఆదివారం హైదరాబాదులోని చార్మినార్ భాగ్యలక్ష్మి మందిరం నుంచి బహదూర్పురా మల్లన్న ఆలయం వరకు గో మహాయాత్ర నిర్వహించేందుకు ముందుకు వచ్చిన పలు గో సంరక్షణ సంస్థలకు అనుమతి కూడా ఇవ్వలేదు. ఇప్పటికే దేశంలోనే గో హత్యలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ముందుంది. తెలంగాణలో అక్రమంగా వున్న కబేళాలను మూసివేయించాలని ఎన్ని విజ్ఞప్తులు పెట్టుకున్నా తెలంగాణ సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదు. స్వయంగా హిందువై ఉండి... హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటూ చిల్లర వ్యాఖ్యలు చేసే కేసీఆర్ నుంచి గోమాత రక్షణను ఆశించడం... ఇసుక నుంచి తైలం పిండే ప్రయత్నం ఒకటే’ అంటూ విజయశాంతి తన ఫేస్బుక్ అకౌంట్లో రాసుకొచ్చారు.
Also Read: మంచిర్యాల: వ్యవసాయ కూలీగా మారిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్... పొలంలో వరినాట్లు వేస్తూ