యాప్నగరం

‘కేసీఆర్ గ్రాఫ్ డౌన్.. 84 శాతం తిరస్కరణ.. షాకింగ్ రిపోర్ట్‌’ వైరల్

కేసీఆర్ దొర పతనం ప్రారంభమైంది. అందుకే 84 శాతం మంది ఆయనను తిరస్కరించారు. ఈ సర్వేలో ప్రజల అభిప్రాయాలే రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరికలని మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి అన్నారు.

Samayam Telugu 18 Aug 2021, 7:11 pm
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ రాములమ్మ మరోమారు షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలు వ్యతిరేకత కనబరుస్తున్నారని.. కేసీఆర్ సర్కార్ విధానాలు నచ్చడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విడుదలైన ఉత్తమ సీఎంల సర్వేలో ఆయన వెనకబడడమే అందుకు నిదర్శనంగా విజయశాంతి చెప్పారు. కేసీఆర్ గ్రాఫ్ డౌన్ అవుతోందని.. దొర పతనం ప్రారంభమైందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kcr


కేసీఆర్ పాలనను తెలంగాణ ప్రజలు వద్దనుకుంటున్నారని విజయశాంతి అన్నారు. అందుకే ఇటీవల నిర్వహించిన అన్ని సర్వేలు కేసీఆర్‌కి వ్యతిరేకంగానే వస్తున్నాయని ఆమె అన్నారు. తాజా సర్వేలో 84 శాతం మంది కేసీఆర్ ప్రభుత్వాన్ని తిరస్కరించారని.. ఈ నియంతృత్వ పాలనపై అసంతృప్తితో ఉన్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆమె మండిపడ్డారు. సర్వే ఫలితాలు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని చేసిన హెచ్చరికలుగా ఆమె అభివర్ణించారు.

అలాగే దళిత బంధు పథకం అమలుపై కూడా విజయశాంతి తీవ్రంగా విమర్శించారు. అర్హులను పక్కన బెట్టి గులాబీ నేతలు అందినకాడికి దోచుకుంటున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు పథకంలో గులాబీ లీడర్ల అక్రమాలు బయటికొస్తున్నాయని.. లబ్ధిదారులతో పింకీలు బేరసారాలు ఆడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలు దళిత బంధు లబ్ధిదారుల నుంచి కమీషన్లు దండుకుంటున్నారని.. అసలైన అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సర్వే రిపోర్టులతో ఆమె చేసిన ట్వీట్ వైరలవుతోంది.

Also Read: పిన్ని ట్రైనింగ్‌కి.. వదిన డెలివరీకి.! కామంతో బుసలు కొట్టిన బాబాయ్, అన్న.. పాపం కూతురు!!
Read Also:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.