యాప్నగరం

KCR సర్కారుకు త్వరలోనే ఎక్స్‌పైరీ డేట్.. విజయశాంతి జోస్యం

రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోన్న కేసీఆర్ కిట్లపై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. అందులో అన్నీ ఎక్స్‌పైరీ అయిన వస్తువులే ఇస్తున్నారని ఆరోపించారు. ఆ కిట్లను ఓపెన్ చేసిన లబ్ధిదారులు..

Authored byAshok Krindinti | Samayam Telugu 17 May 2022, 9:20 pm
Samayam Telugu విజయశాంతి
కేసీఆర్ కిట్లలో ఎక్స్‌‌‌‌‌‌‌‌పైరీ అయిన వస్తువులు పంపిణీ అవుతున్నాయని.. వాటినే బాలింతలకు అందజేస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పాతబస్తీకి చెందిన ఓ బాలింతకు ఇచ్చిన కిట్‌‌‌‌‌‌‌‌లో అన్ని వస్తువులూ ఎక్స్‌‌‌‌‌‌‌‌పైరీ అయినవే ఉన్నాయన్నారు. ఇంటికెళ్లిన తర్వాత ఎక్స్‌‌‌‌‌‌‌‌పైరీ డేట్ చూసి కంగుతిన్న కుటుంబ సభ్యులు.. తిరిగి వాటిని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చి ఇచ్చేశారని చెప్పారు. అందులో 2020 ఆగస్టులోనే ఎక్స్‌పైర్ అయిన బేబీ పౌడర్, 2021 ఆరో నెలలో ఎక్స్‌‌‌‌‌‌‌‌పైర్ అయిన బేబీ ఆయిల్, అదే ఏడాది ఏడో నెలలో ఎక్స్‌‌‌‌‌‌‌‌పైర్ అయిన బేబీ సోప్స్, తొమ్మిదో నెలలో ఎక్స్‌‌‌‌‌‌‌‌పైర్ అయిన బేబీ షాంపు ఉన్నాయని పేర్కొన్నారు.

దీంతో మెడికల్ ఆఫీసర్లు గుట్టుచప్పుడు కాకుండా ఆ వ్యక్తికి మరో కిట్ ఇచ్చి పంపించారని విజయశాంతి అన్నారు. పైగా ఈ వ్యవహారాన్నిలైట్ తీసుకోవాలని చెప్పారని.. విషయం బయటకు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ల కొనుగోలు, పంపిణీపై అధికారుల పర్యవేక్షణ కొరవడడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు చెబుతున్నారని అన్నారు.

'కేసీఆర్.. ప‌థ‌కానికి నీపేరు పెట్టుకుంటే స‌రిపోదు. దాని అమ‌లు తీరును కూడా ప‌ట్టించుకోవాలి. ఎక్స్‌‌‌‌‌‌‌‌పైరీ అయిన వస్తువులు పంపిణీ చేస్తున్న కేసీఆర్ స‌ర్కార్‌కి కూడా త్వరలోనే ఎక్స్‌పైరీ డేట్ రానుంది..' అని విజయశాంతి జోస్యం చెప్పారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియో ప్రకటన విడుదల చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.