యాప్నగరం

జైల్లో మరుగుదొడ్లు కడిగించారు, కొట్టారు.. మహిళల రోదనలకి చలించిపోయిన ఫైర్ బ్రాండ్

పసిబిడ్డల తల్లులను జైల్లో పెట్టి చేయి చేసుకోవడం దారుణమని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళల దక్కుతున్న గౌరవం ఇదేనంటూ ఆమె మండిపడ్డారు.

Samayam Telugu 12 Aug 2021, 11:56 pm
కేసీఆర్, ఆయన సర్కార్ విధానాలపై ఎప్పటికప్పుడు పదునైన విమర్శలతో విరుచుకుపడే బీజేపీ ఫైర్‌బ్రాండ్, సీనియర్ మహిళా నేత విజయశాంతి మరోమారు షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మహిళలని కూడా చూడకుండా ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో పోడు భూముల వ్యవహారంలో జరిగిన నిరసనల్లో అటవీ సిబ్బందిపై దాడి, హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పసిబిడ్డల తల్లులను సైతం అరెస్టు చేసి జైలుకి పంపారని.. ఆ దుశ్యర్యను కళ్లారా చూశామని విజయశాంతి అన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
vijayashanthi


జైల్లో మహిళలపై జరిగిన దాష్టీకాలపై బాధితులు చెప్పిన మాటలకు ఆమె చలించిపోయారు. జైలు సిబ్బంది చేయి చేసుకున్నారని, బూతులు తిడుతూ మరుగుదొడ్లు కూడా కడిగించారని.. ఒంట్లో బాగోకపోయినా మందులివ్వలేదని జైల్లో ఎదురైన చేదు అనుభవాల్ని చెప్పుకుని రోదించడం చూశామని.. ఈ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధిస్తోందని రాములమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ బీసీ కమిషన్ ఈ పరిణామాలను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టడం కాస్తలో కాస్త ఊరటనిస్తోందన్నారు విజయశాంతి. తెలంగాణలో మహిళలకు దక్కుతున్న గౌరవం ఇదేనంటూ ఆమె కేసీఆర్ సర్కార్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.