యాప్నగరం

సికింద్రాబాద్ ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తాం: ఈటల రాజేందర్

Eatela Rajender: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్ స్కీమ్’కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపించకపోతే కేంద్ర ప్రభుత్వం సీబీఐతో దర్యాప్తు చేయిస్తుందని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వమే యువకులను అడ్డం పెట్టుకుని విధ్వంసం సృష్టించిందనే అనుమానం కలుగుతోందని ఆయన అరోపించారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 17 Jun 2022, 7:36 pm
కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపించకపోతే కేంద్ర ప్రభుత్వం సీబీఐతో దర్యాప్తు చేయిస్తుందని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వమే యువకులను అడ్డం పెట్టుకుని విధ్వంసం సృష్టించిందనే అనుమానం కలుగుతోందని ఆయన అరోపించారు. ‘ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కోసం సన్నద్ధమయ్యే వాళ్లకు దేశ భక్తి ఉంటుంది. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అభ్యర్థుల ముసుగులో రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు చొరబడి విధ్వంసం సృష్టించారు. ఘటనకు కారకులను గుర్తిస్తాం’ అని ఈటల అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం (జూన్ 17) సాయంత్రం మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడారు.
Samayam Telugu ఈటల రాజేందర్
Eatela Rajender on Secunderabad riots


రాజ్‌ భవన్‌ ముట్టడి, సికింద్రాబాద్‌ ఘటన వెనుక కుట్ర ఉందని ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులైనా, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులైనా ప్రజలవేనని.. ఆ ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఈటల అన్నారు. ‘రైల్వే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. రాష్ట్రానికి సంబంధం లేదన్నట్లు తప్పించుకుంటోంది’ అని ఈటల ఆరోపించారు.

‘కొవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రిక్రూట్‌మెంట్లు ఆలస్యమయ్యాయి. వీటితో పాటు ఆర్మీ రిక్రూట్‌మెంట్ కూడా ఆలస్యమైన మాట వాస్తవమే. 17 నుంచి 23 ఏళ్ల యువతకు ఉపాధితో పాటు క్రమశిక్షణ పెంపొందించేందుకే కేంద్రం అగ్నిపథ్‌ స్కీమ్ తీసుకొచ్చింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ సంక్షేమం, ప్రజానీకానికి అవసరమయ్యే నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజాక్షేత్రంలో పలుకుబడి లేనివాళ్లే అసహనంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు’ అని ఈటల రాజేందర్‌ అన్నారు.

Also Read:

GHMC చెత్త ఆటోలు మాయం.. ఇదేం ‘చెత్త’?!
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.