యాప్నగరం

వాళ్లని కాల్చి పారేయండి, చంపేయండి.. తెలంగాణ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Coronavirus Cases in India: మార్చి 13 నుంచి 15 మధ్య ఈ సభ జరిగిందని, దేశంలో అప్పటికే కరోనా ముప్పు ఉన్నందున ఈ సభకు ఎలా అనుమతి ఇచ్చారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను నిలదీశారు.

Samayam Telugu 31 Mar 2020, 1:24 pm
దేశంలో అప్పటికే కరోనా వైరస్ కేసులు నమోదైన వేళ దిల్లీలోని నిజాముద్దీన్ వద్ద మతపరమైన భారీ ప్రార్థన సభ ఎలా నిర్వహిస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఈ ప్రార్థన సభకు తెలంగాణ, ఏపీ నుంచే కాక, దేశంలో మొత్తం ఆరు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది వ్యక్తులు హాజరయ్యారని వివరించారు. అంతేకాక, ఇండోనేసియా సహా విదేశాల నుంచి ఎంతో మంది మత ప్రబోధకులు ఈ సభకు వచ్చి ప్రసంగించారని వెల్లడించారు. మార్చి 13 నుంచి 15 మధ్య ఈ సభ జరిగిందని, దేశంలో అప్పటికే కరోనా ముప్పు ఉన్నందున ఈ సభకు ఎలా అనుమతి ఇచ్చారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను నిలదీశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
Samayam Telugu raja sing


Also Read: దిగ్గజ నిర్మాత ట్వీట్‌పై కేటీఆర్ అదిరే ఆన్సర్.. వాళ్లని ఏకిపారేస్తున్న నెటిజన్లు

ఈ సభకు హాజరైన వారే ఎక్కువ మంది కరోనా పాజిటివ్‌లుగా తేలుతుండడంతో వారికి సంబంధించిన వారికి వైద్యాధికారులు పరీక్షలు జరుపుతున్నారని అన్నారు. అయితే, కొన్ని రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వారు సహకరించడం లేదని, అలాంటివారిని కాల్చి పారేయాలని వ్యాఖ్యానించారు. వారిని చంపేసి దేశాన్ని, తెలంగాణ, ఏపీని కాపాడుకోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొంత మంది వల్ల అందర్నీ ప్రమాదంలో పెట్టలేమని అన్నారు. మొత్తం ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తాను కోరుతున్నానని, ఆ ప్రార్థనలతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఒక వేళ సహకరించకపోతే వారిని నిర్దాక్షిణ్యంగా షూట్ చేసి, చంపేసి, తమ రాష్ట్రాలను కాపాడుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: ఈ పరిస్థితి చూస్తుంటే, ఆ మాటలు గుర్తొస్తున్నాయ్, ఓ మహాత్మా..: విజయశాంతి

Also Read: లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి భారీగా క్యూ.. మందు బాబుల అదుపు‌నకు పరిష్కారం ఏంటంటే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.