యాప్నగరం

బండి సంజయ్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక ?

ఇటీవలూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కరోనా బారిన పడ్డారు. ఆయనతో సంజయ్ ప్రైమరీ కాంటాక్ట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో బండి సంజయ్ అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో టెన్షన్ నెలకొంది.

Samayam Telugu 27 Sep 2020, 8:08 am
ఎంపీ బండి సంజయ్‌కు అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. బీజేపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సెల్ఫ్ క్వారన్ టైన్లో బీజేపీ అధ్యక్షుడు ఉన్నారని... ప్రస్తుతం ఆయన ఎయిమ్స్‌లో చేరినట్లు కూడా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కృష్ణదాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనతో ఎంపీ సంజయ్ ప్రైమరీ కాంటాక్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే బండి సంజయ్ బాగానే ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Samayam Telugu బండి సంజయ్
bandi sanjay


Read More: దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభం: కేసీఆర్

ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని సన్నితులు చెబుతున్నారుబ. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు నేతలు, ఆయన అభిమానులు మాత్రం బండి సంజయ్ ఆరోగ్యంపై ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలామంది నేతలు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు సైతం కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ కోలుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.