యాప్నగరం

బ్రేకుల్లేని బస్సుల్లో పాక్‌ పంపిస్తాం: బీజేపీ ఎంపీ బండి సంజయ్

Warangal: ‘సీఏఏను వ్యతిరేకిస్తున్న వారంతా దేశ ద్రోహులే. ఎంఐఎం నాయకులారా.. మీకు ఈ గడ్డ మీద స్థానం లేదు. మీరు అవసరమైతే పాకిస్థాన్ పోతారో, బంగ్లాదేశ్ పోతారో, అఫ్గానిస్థాన్ పోతారో నిర్ణయించుకోండి.’

Samayam Telugu 8 Jan 2020, 4:35 pm
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని సంజయ్ ఆరోపించారు. వరంగల్‌లో సీఏఏకు అనుకూలంగా బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఎంపీ బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారంతా దేశ ద్రోహులేనని, వారు దేశం విడిచి పాకిస్థాన్ పోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాడులకు భయపడబోమని, ఇకపై ఎదురుదాడి చేస్తామని అన్నారు. ఎంఐఎం పార్టీని దుర్భాషలాడుతూ మాట్లాడారు.
Samayam Telugu Bandi Sanjay


Also Read: మంత్రి కేటీఆర్‌తో న్యూజిలాండ్ ఎంపీ భేటీ.. ప్రధానితో సమావేశం!

‘‘ఎంఐఎం నాయకులారా.. మీకు ఈ గడ్డ మీద స్థానం లేదు. మీరు అవసరమైతే పాకిస్థాన్ పోతారో, బంగ్లాదేశ్ పోతారో, అఫ్గానిస్థాన్ పోతారో నిర్ణయించుకోండి. కావాలంటే మీకు విమానం, హెలికాప్టర్ ఇస్తాం. అవసరమైతే బ్రేకుల్లేని బస్సులో పంపిస్తాం. సీఏఏ వాస్తవ విషయాలను అంతా గ్రహించాలి. అవాస్తవాలను నిజాలుగా ప్రచారం చేసే ఇలాంటి వారికి ప్రజలంతా బుద్ధి చెప్పాలి.’’

Also Read: మంత్రి జగదీశ్ రెడ్డి త్వరగా కోలుకోవాలి.. ప్రత్యేక పూజలు, పలువురి పరామర్శ

‘‘ద్రోహుల్లారా ఖబడ్దార్.. మీరు రాళ్లు పడితే, మేం బాంబులు పడతాం. నువ్వు కట్టలు పడితే, మేం కత్తులు పడతాం. నువ్వు రాకెట్లు పడితే, మేం లాంచర్లతో కొడతాం. యుద్ధం మొదలైంది. ఎవర్నీ వదిలిపెట్టం. ఓరుగల్లు నుంచే యుద్ధం ప్రారంభిస్తాం. నిజాం వారసులై వాళ్లు పచ్చ జెండా పట్టుకొని వస్తే, ఛత్రపతి శివాజీ, వీర సావర్కర్, భగత్ సింగ్ వారసులమై కాషాయ జెండా, కమలం పువ్వు చేత పట్టుకొని, భారత్ మాతాకీ జై అంటూ మనం వస్తున్నాం. ఈ యుద్ధంలో దేనికైనా సిద్ధమై ముందుకు పోదాం.’’ అని మజ్లిస్ పార్టీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్లేనని, ఒవైసీ సోదరుల ఆటలు తెలంగాణలో సాగవని ధ్వజమెత్తారు.

Also Read: ఇరాన్ Vs అమెరికా.. హైదరాబాద్‌లో భారీ భద్రత

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.