యాప్నగరం

సీఎం కేసీఆర్‌ను దించేందుకు కుట్ర.. ఎంపీ అర్వింద్

సీఎం కేసీఆర్‌కు పదవీ గండం ఉందంటూ బీజేపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. కేసీఆర్, కేటీఆర్ జైలుకి వెళ్లకుండా ఆపడం ఎవరితరం కాదని ఆయన అన్నారు.

Samayam Telugu 28 Mar 2022, 9:01 pm
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పదవి నుంచి దించేందుకు కుట్ర జరుగుతోందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. రాష్ట్రంలో ప్రస్తుతం 1980ల నాటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు. గతంలో ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర్ రావు, మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వాలను దించేసిన తరహాలోనే కేసీఆర్ చుట్టూ కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి హరీశ్ రావు, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవిత కలిసి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు చూస్తున్నారని ఆయన అన్నారు.
Samayam Telugu Dharmapuri-Arvind


కేటీఆర్‌ను సీఎం చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామని కేసీఆర్ అనుకున్నారని.. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో వెనక్కి తగ్గారని ఎంపీ అర్వింద్ అన్నారు. మంత్రి కేటీఆర్ అలిగి అమెరికా పర్యటనకు వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన తండ్రీకొడుకులు జైలుకి వెళ్లకుండా ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు.కేసీఆర్ కుటుంబ సభ్యులే ఆయన్ను పదవిలో నుంచి దించేందుకు చూస్తున్నారంటూ సంచలనం రేపారు.

కేసీఆర్ కుమార్తె, తన రాజకీయ ప్రత్యర్థి కల్వకుంట్ల కవితపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరి కొనమంటే కొనకుండా.. బీజేపీ కార్పొరేటర్లను కొంటోందని ఎద్దేవా చేశారు. ఏడాదిలో ఎన్నికలు పెట్టుకుని ఇప్పుడు కార్పొరేటర్లను ఏం చేసుకుంటారని సెటైర్లు వేశారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ బీజేపీకి ఎంత బలమో.. నిజామాబాద్‌లో కవిత ప్రత్యర్థిగా ఉండడం కూడా అంతేనని ఆయన అన్నారు. రాహుల్ గాంధీతో పోల్చినందుకు కవిత సంబరపడాలంటూ ఎద్దేవా చేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.