యాప్నగరం

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తలకు కొమ్ములు..!

Nizamabad రైతులు ఎంపీ ధర్మపురి అర్వింద్‌పైన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఐదు రోజుల్లోనే నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని, లేకుంటే పదవికి రాజీనామా చేస్తానని అర్వింద్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Samayam Telugu 18 Dec 2019, 8:06 pm
పసుపు బోర్డు విషయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఇటీవల ఆయన పసుపు బోర్డు రాదని తేల్చేశారు. దాని స్థానంలో బోర్డు కన్నా మేలైన మరో వ్యవస్థ అమలు పర్చేందుకు కేంద్రం యోచిస్తోందని ప్రకటించారు. అప్పటి నుంచి ఎంపీ అర్వింద్‌పైన రైతులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఐదు రోజుల్లోనే నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని, లేకుంటే పదవికి రాజీనామా చేస్తానని హామీ ఇచ్చిన అర్వింద్ తమను మోసం చేశాడని రైతులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
Samayam Telugu Dharmapuri Arvind


Must Read: కారు తాళాలు మర్చిపోయి.. గవర్నర్ తమిళిసై సిబ్బంది నిర్వాకం..

ఈ నేపథ్యంలో ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లోనే కాకుండా, బహిరంగంగా ట్రోల్స్ మొదలయ్యాయి. ఎంపీ అర్వింద్ వెంటనే రాజీనామా చేయాలని నిజామాబాద్‌లో విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫ్లెక్సీలపై ఎంపీ అర్వింద్ చిత్రానికి కొమ్ములు ఉన్నట్లుగా గ్రాఫిక్స్ చేసి నిరసన చేపడుతున్నారు. అంతేకాక, జక్రాన్ పల్లిలో ఎంపీ రాజీనామా చేయాలనే ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ నెలాఖరులోపు బోర్డు తేకపోతే పోరాటం కోసం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

Must Read: పశువులకు హాస్టళ్ల ఏర్పాటుకు రంగం సిద్ధం.. ఎందుకివీ?

లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో పసుపు బోర్డు తప్పక ఏర్పాటు చేయిస్తానని, అర్వింద్ బాండ్‌ పేపర్‌పై రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆయన పసుపు బోర్డు అంబాసిడర్‌ కారు లాంటిదని.. కేంద్రం ప్రవేశపెట్టనున్న ‘టైస్‌’, ‘క్లస్టర్స్‌’ అనే వ్యవస్థలు హోండా కార్లలాంటివని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలతో రైతులను కించపర్చారని జేఏసీ సభ్యులు విమర్శించారు. సరికాదన్నారు.

Must Read: యాదాద్రి పునర్నిర్మాణం పూర్తయితే.. ఆలయం ఇలా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.