యాప్నగరం

తెలంగాణలోనూ మూడు రాజధానులు.. ఆదిలాబాద్‌లో అసెంబ్లీ..!

‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటించిన 3 రాజధానుల ఆలోచన బాగుంది. తెలంగాణలో కూడా అలాగే ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ దూరం ఉన్నందున ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.’

Samayam Telugu 19 Dec 2019, 3:20 pm
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం తెలంగాణకూ సోకింది. విశాఖపట్నం, అమరావతి, కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయవచ్చని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. న్యాయవ్యవస్థను కర్నూలులో, కార్యనిర్వాహక వ్యవస్థను విశాఖపట్నంలో, అసెంబ్లీ నిర్వహణను అమరావతిలో ఏర్పాటు చేయవచ్చని జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ కొంత మంది ప్రజా ప్రతినిధులు ఇలాంటి ప్రతిపాదనలు లేవనెత్తుతున్నారు.
Samayam Telugu Bapurao soyam


Also Read: సంక్రాంతిలోపే మున్సిపల్ ఎన్నికలు.. కేసీఆర్ కసరత్తు?

తెలంగాణ బీజేపీ ఎంపీ ఒకరు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ ఎంపీ అయిన సోయం బాబురావు సీఎం జగన్ ప్రతిపాదనకు మద్దతు పలికారు. తెలంగాణలోనూ మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ జరపాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ విషయంపై తాను సీఎం కేసీఆర్‌తో మాట్లాడానని, త్వరలో గవర్నర్ తమిళిసైను కూడా కలిసి ఈ అంశంపై చర్చిస్తానని బాబూరావు వెల్లడించారు. ఆదిలాబాద్‌-హైదరాబాద్‌ మధ్య దూరం చాలా ఉందని, అందుకే సంవత్సరంలో కనీసం రెండు సార్లు శాసనసభ సమావేశాలను ఆదిలాబాద్‌లో నిర్వహించాలని సూచించారు.

Also Read: కూలిన శ్లాబ్.. ఎమ్మెల్యే గొంగిడి సునీతకు గాయాలు

ఇక ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ మూడు రాజధానుల అంశం ప్రకటించిన నాటి నుంచి దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ జగన్ ప్రతిపాదనను దీటుగా తిప్పికొడుతోంది. ముఖ్యంగా రాజధాని ప్రాంత రైతులు జగన్ నిర్ణయంపై తీవ్ర ఆందోళన చేస్తున్నారు. విశాఖ, కర్నూలు ప్రాంత వాసులు సంబరంలో ఉన్నా.. మూడు రాజధానుల అంశం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Flyover Accident: మిగతా ఫ్లైఓవర్ల డిజైన్లలో సమూల మార్పులు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.