యాప్నగరం

ఈ సభ అంతకుమించి ఉంటుంది.. ప్రధాని రాష్ట్రానికి రాగానే కేసీఆర్ గుంటనక్కలా పారిపోతాడు: సంజయ్

తమకు ఒక్క అవకాశమిస్తే.. కేసీఆర్, కుటుంబ అవినీతిని తరిమికొడతామని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో మార్పు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో అందరికీ అవకాశం ఇచ్చారని.. తమకు అవకాశం ఇచ్చి చూడండని ప్రజలను ఆయన కోరారు.

Authored byRaj Kumar | Samayam Telugu 26 Jun 2022, 2:51 pm
Samayam Telugu bandi sanjay
జులై మొదటి వారంలో హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించబోయే బీజేపీ భారీ బహిరంగ సభ సక్సెస్ కావాలని పరేడ్ గ్రౌండ్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భూమి పూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

జులై 3న సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ ఉంటుందని స్పష్టం చేశారు. తుక్కుగూడ అమిత్ షా సభ, జేపీ నడ్డా సభ చూశారు.. ఇప్పుడు అంతకు మించి మోదీ సభను చూడబోతున్నారంటూ వ్యాఖ్యానించారు. సభ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, తక్కువ సమయం ఉండటంతో పగలూరాత్రి పనులు కొనసాగుతాయని తెలిపారు. తెలంగాణలో మార్పు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో అందరికీ అవకాశం ఇచ్చారని.. తమకు అవకాశం ఇచ్చి చూడండని ప్రజలను ఆయన కోరారు.

తమకు ఒక్క అవకాశమిస్తే.. కేసీఆర్, కుటుంబ అవినీతిని తరిమికొడతామని సంజయ్ అన్నారు. తెలంగాణలో బీజేపీని కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అయినా బీజేపీని అడ్డుకోవడం వారి వల్ల కావట్లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు టైమ్‌ దగ్గర పడిందని, బీజేపీ దృష్టిలో కేసీఆర్ చిటికెడే అని వ్యాఖ్యానించారు. ప్రధాని రాష్ట్రానికి రాగానే కేసీఆర్ గుంటనక్కలా పారిపోతాడని ఎద్దేవా చేశారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.