యాప్నగరం

3 కమిటీలను ప్రకటించిన బీజేపీ.. ఈటలకు కీలక బాధ్యతలు

Telangana BJP | బీజేపీ తెలంగాణ పార్టీ మూడు కమిటీలను ప్రకటించింది. చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్‌గా ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఫైనాన్స్ కమిటీ, ప్రజా సమస్యలు - టీఆర్‌ఎస్ వైఫల్యాలపై అధ్యయన కమిటీని నియమించారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 5 Jul 2022, 6:53 pm
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP) ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar) మూడు కమిటీలను ప్రకటించారు. పార్టీలో నేతల చేరికలపై సమన్వయ కమిటీ, ఫైనాన్స్ కమిటీ, ప్రజా సమస్యలు - టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు.
Samayam Telugu బీజేపీ మీటింగ్
Bandi Sanjay Kumar


చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్‌గా హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌ను నియమించారు. ఈ కమిటీలో ఈటలతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాజ్యసభ సభ్యుడు డాక్ట్ లక్ష్మణ్‌, వివేక్‌ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, ఎ. చంద్రశేఖర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌ ఉన్నారు.

ఇక ఫైనాన్స్‌ కమిటీ కన్వీనర్‌గా మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డిని నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా గరికపాటి మోహన్‌ రావు, చాడ సురేశ్‌ రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, శాంతి కుమార్‌, యోగానంద్‌ ఉన్నారు. ప్రజా సమస్యలు - టీఆర్‌ఎస్ వైఫల్యాలపై అధ్యయన కమిటీ కన్వీనర్‌గా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఎంపిక చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, వివేక్‌ వెంకటస్వామి, స్వామిగౌడ్‌, డాక్టర్ ప్రకాశ్‌ రెడ్డి, బాజీ అజ్మీరా ఉన్నారు.

పార్టీ హైకమాండ్ సూచనల నేపథ్యంలోనే ఈటల రాజేందర్‌కు ప్రచార కమిటీ కన్వీనర్‌‌గా బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఈటలను ఎంచుకున్నట్లు చూపినట్లు సమాచారం.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.