యాప్నగరం

సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర పేలుడు.. ఒకరికి గాయాలు

ముత్యాలమ్మ ఆలయం దగ్గర్లో ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో అతడ్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 25 Oct 2020, 11:14 am
సికింద్రాబాద్‌లో పేలుడు కలకలం రేపింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద బాలానగర్‌ బస్టాండ్‌ సమీపంలో పేలుడు కలకలం సృష్టించింది. ఒక్కసారి భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా జనమంతా ఉలిక్కిపడ్డారు. ముత్యాలమ్మ ఆలయం వద్ద చెత్త డబ్బాలో పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
Samayam Telugu సికింద్రాబాద్‌లో పేలుడు


దీంతో వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. డబ్బాలో చెత్త ఏరుకుంటుండగా పేలుడు జరిగినట్లు సదరు వ్యక్తి పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేయిస్తున్నాయి. చెత్తకుప్పలో ఉన్న పెయింట్‌ డబ్బా పేలిందని పోలీసులు గుర్తించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న జగద్గిరిగుట్టలో కూడా ఓ పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఆటో తీస్తుండగా బ్లాస్ట్ జరిగి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ పేలుడులో ఆటో మొత్తం అగ్నికి ఆహుతయ్యింది.

Read More: పండగ పూట విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

ఈ పేలుడులో నిజామాబాదు ప్రాంతానికి చెందిన 56 సంవత్సరాల రాజు గాయపడినట్లు తెలుస్తోంది. అతని ఎడమ చేతికి గాయం అయ్యింది. దీంతో అతడ్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. 30 సంవత్సరాలుగా సికింద్రాబాద్లో ఉంటూ చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. యధావిధిగా చెత్త ఏరుకునే సంచిలో డబ్బాలు తీసుకొచ్చి నేలకు వేసి కొట్టగా ఒక్కసారిగా కెమికల్ డబ్బా పేలినట్లు తెలుస్తోంది. అయితే అమ్మవారి గుడికి దగ్గర్లో దసరా రోజున ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.