యాప్నగరం

Warangal: గ్రానైట్ ఫ్యాక్టరీలో పేలుళ్లు.. ఇద్దరు మహిళల పరిస్థితి విషమం

కాజీపేటలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్లలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.

Samayam Telugu 26 Sep 2019, 6:37 pm
రంగల్ అర్బన్ జిల్లాలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా జరిగిన పేలుళ్లలో పలువురు కార్మికులు గాయపడ్డారు. కాజీపేట సమీపంలోని మడికొండలో వజ్ర మాట్రిక్స్ గ్రానైట్ ఫ్యాక్టరీలో గురువారం (సెప్టెంబర్ 26) సాయంత్రం పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు మహిళా కార్మికులు ఉన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
Samayam Telugu blast


ప్రమాదంలో స్వరూప అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమె కాలు, కన్ను వద్ద మొత్తం కాలిపోయింది. ప్రియాంక అనే మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న డీసీపీ నాగరాజు తన బృందంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Also Read: విద్యార్థినుల ఫోటోలు తీసి పోర్న్ సైట్లలో.. హైదరాబాద్‌ యువతి దారుణం

ఎక్కువ మోతాదులో కెమికల్స్ ఉపయోగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు డీసీపీ నాగరాజు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.