యాప్నగరం

తండ్రి అంత్యక్రియల కోసం.. హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల హైదరాబాద్ చేరుకున్నారు. తండ్రి అంత్యక్రియల కోసం ఆయన లండన్ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ వచ్చారు. సోమవారం యుగంధర్ అంత్యక్రియలు జరుగుతాయి.

Samayam Telugu 15 Sep 2019, 10:23 am
తండ్రికి కడసారి వీడ్కోలు పలకడం కోసం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల హైదరాబాద్ చేరుకున్నారు. లండన్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం ఉదయం ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని నివాసానికి చేరుకున్నారు. సత్యనాదెళ్ల తండ్రి, రిటైర్డ్ ఐఏఎస్ అయిన బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు సోమవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరుగుతాయి. గత కొంత కాలంపాటు అనారోగ్యంతో బాధపడిన యుగంధర్.. శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
Samayam Telugu satya nadella


అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. పీఎంవో కార్యదర్శిగా, ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా, పలు కీలకమైన హోదాల్లో పని చేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ వివిధ హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీగా పనిచేసిన సమయంలో.. గ్రామీణాభివృద్ధిలో ఎన్నో పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చారు.

1988-1993 వరకు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమికి డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. పదవీ విరమణ పొందాక యుగంధర్‌ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. సత్య నాదెళ్ల తల్లి ప్రభావతి 2015లోనే మరణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.