యాప్నగరం

వరదలు: హైదరాబాద్‌కు చేరిన 40 పడవలు.. లారీల్లో తరలింపు.. వీడియో

Hyderabad Floods: మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బోట్లన్నీ రవీంద్ర భారతి ప్రాంతంలో లారీల్లో ఉంచారు.

Samayam Telugu 20 Oct 2020, 10:25 pm
హైదరాబాద్‌‌లో భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ చోట్ల నుంచి పడవలను అధికారులు నగరానికి తెప్పించారు. పర్యటక ప్రదేశాల్లో ఆ శాఖ ఆధ్వర్యంలో ఉన్న మర పడవలు సహా, సాధారణ పడవలను లారీల్లో హైదరాబాద్‌కు తరలించారు. ఏపీ, తెలంగాణ టూరిజానికి చెందిన వివిధ పర్యటక ప్రాంతాల నుండి 40 బోట్లు హైదరాబాద్ కు చేరుకున్నాయి. గత వారం రోజులుగా భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే.
Samayam Telugu రవీంద్రభారతి వద్ద లారీల్లో పడవలు
hyderabad floods


మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బోట్లన్నీ రవీంద్ర భారతి ప్రాంతంలో లారీల్లో ఉంచారు. అక్కడి నుంచి అవసరాన్ని బట్టి వరద ప్రభావిత ప్రాంతాలకు బోట్లను తరలించనున్నారు.

హైదరాబాద్‌లో మంగళవారం కూడా ఉదయం నుంచి దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. నగరమంతా పట్టపగలే చీకటిగా మారింది. ఉరుములు, మెరుపులు కూడా వస్తున్నాయి. హయత్‌నగర్, కొత్తపేట, సంతోష్‌నగర్‌, సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్, బేగంపేట్, ఉప్పల్, మీర్‌పేట్‌, రామంతాపూర్, హబ్సీగూడలో కుండపోతగా వర్షం కురిసింది. భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే జీహెచ్‌ఎంసీ కమిషనర్ హెచ్చరించారు. న‌గ‌ర ప్రజ‌లు ఎవరూ ఇళ్లలోంచి బ‌య‌ట‌కు రావొద్దని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.