యాప్నగరం

చిన్నారిని బలిగొన్న బొలెరో.. స్కూల్ నుంచి వస్తుండగా ఘోరం

Kukatpally: స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న చిన్నారిని బొలెరో వాహనం బలి తీసుకుంది. తమ చిన్నారి దుర్మరణం చెందడంతో కన్నవాళ్లు రోదిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తోంది.

Samayam Telugu 19 Sep 2019, 11:29 pm
పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న చిన్నారిని బొలెరో వాహనం బలి తీసుకుంది. తమ గారాలపట్టి దుర్మరణం పాలవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కూకట్‌పల్లిలో గురువారం (సెప్టెంబర్ 19) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీనివాసరావు, హేమలత దంపతులు కూకట్‌పల్లిలోని ఏవీబీ పురంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె రిషిత (7) స్థానికంగా సెయింట్‌ రీటా స్కూల్లో రెండో తరగతి చదువుతోంది.
Samayam Telugu Rishita


గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో తరగతులు ముగిసిన తర్వాత తన అక్క జాహ్నవితో కలిసి రిషిత పాఠశాల నుంచి ఇంటికి బయలుదేరింది. పాఠశాల దాటగానే ఉన్న మలుపు వద్ద వేగంగా దూసుకొచ్చిన బొలేరో వాహనం ఆ చిన్నారిని బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రిషితను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.

Must Read: ఆ రోజు కాళరాత్రి చూశా.. రిటైర్డు జడ్జి నూతి రామ్మోహన్ రావు కోడలి ఆవేదన

సమాచారం అందుకున్న పోలీసులు బొలేరో డ్రైవర్‌ హేమాచలాన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు ఘటనా స్థలాన్ని పరిశీంచారు. చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.