యాప్నగరం

నిందితుడి ఇంట్లో పేలిన నాటు బాంబు

అతని ఇంట్లో నిషేధిత పేలుడు పదార్థాలు ఉన్నాయి. చాలారోజులుగా వాటిని వాడకుండా అలానే ఉంచేయడంతో ఒక్కసారిగా పేలాయి. ఈ ఘటనలో ఇంటి పైకప్పు ధ్వంసం అయ్యింది.

Samayam Telugu 31 Oct 2020, 6:39 am
ఓ ఇంట్లో నాటు బాంబు పేలింది. దీంతో ఒక్కసారిగా ఇంటి పైకప్పు ధ్వంసం అయ్యింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లిలో జరిగింది. శుక్రవారం నాటు బాంబు పేలిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం ఎస్సీ కాలనీకి చెందిన పుల్లూరి సిద్ధరాములు అనే వ్యక్తి ఇంట్లో నిల్వ ఉంచిన నిషేధిత పదార్థాలు ఒక్కసారిగా పేలాయి. దీంతో అతని ఇంటి పైకప్పు ధ్వంసమైంది.
Samayam Telugu నాటు బాంబు పేలుడు


Read More: హైదరాబాద్‌లో బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సిద్ధరాములు అడవి పందులను వేటాడడానికి పేలుడు పదార్థాలను ఉపయోగిస్తుంటారు. చాలా రోజులుగా వాటిని బయటకు తీయడంతో ప్రమాదవశాత్తు పేలిపోయాయి. సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు స్థానికులు. అయితే గతంలో జరిగిన జంట హత్య కేసులో రాములు నిందితుడు కావడం గమనార్హం. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నవీన్‌ కుమార్‌ తెలిపారు. రాములును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.