యాప్నగరం

తాను చనిపోయిన 8మందికి అవయువాలు దానం చేసిన యువకుడు

రోడ్డు యాక్సిడెంట్‌లో కుమార్ తలకు బలమైన గాయం అయ్యింది. దీంతో మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేసిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించారు.

Samayam Telugu 22 Sep 2020, 8:30 am
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ యువకుడు మరో ఎనిమిది మందికి ప్రాణ దాతగా నిలిచాడు. అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న ఎనిమిది మందికి తన అవయువాల్ని దానం చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా రాజపూర్‌ మండలం రంగారెడ్డిగూడ సింగమగూడ తండాకు చెందిన విస్లావత్‌ కుమార్ ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నాడు. కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉండేందుకు చిన్న చిన్న పనులు చేసేవాడు.
Samayam Telugu ఎనిమిదిమందికి అవయువదానం
donate organs


ఈ నెల 18న బైకుపై ఇంటికి వెళ్తుండగా వాహనం అదుపు తప్పి కిందపడిపోయి గాయపడ్డాడు. దీంతో అతడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కొండాపూర్‌ కిమ్స్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. 26 గంటలపాటు వైద్యం అందించిన డాక్టర్లు కుమార్ బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న జీవన్‌దాన్‌ ప్రతినిధులు వెంటనే కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నాడు.

Read More: రెండు నిండుప్రాణాలు బలి.. దిద్దుబాటు చర్యలు చేపట్టిన GHMC

కుమార్ కుటుంబసభ్యుల్ని కలిశారు. అతని‌ తల్లి మారు, సోదరుడు రాజేష్‌లకు అవయవ దానంపై కౌన్సెలింగ్‌ చేశారు. దీంతో వారు కుమార్ అవయువాలు దానం చేసేందుకు అంగీకరించారు. అతని నుంచి గుండె, కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, నేత్రాలు సేకరించి.. 8 మందికి మార్పిడి చేసినట్లు నిమ్స్‌ జీవన్‌దాన్‌ ఇన్‌ఛార్జి స్వర్ణలత వెల్లడించారు. అవయువ దానం చేయడం వల్ల మరొకరి జీవితం నిలబెట్టిన వారవుతారని ఆమె పేర్కొన్నారు. కుమార్ కుటుంబసభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.