యాప్నగరం

పెళ్లికి గంట ముందే వరుడు మృతి.. మహబూబ్‌నగర్‌లో విషాదం

Mahabubnagar: శనివారం రాత్రి 11 గంటల 27 నిమిషాలకు పెళ్లి ఉండగా.. రాత్రి 10 గంటలకు పెళ్లి కుమారుడు చనిపోయాడు. వరుడు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం అలుముకుంది.

Samayam Telugu 9 Aug 2020, 10:07 am
శుభ ముహూర్తంలో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన పెళ్లి కొడుకు అదే సమయానికి చనిపోవడం సంచలనం రేపుతోంది. బాజా భజంత్రీలు మోగాల్సిన ఆ పెళ్లిపందిరిలో చావుడప్పులు, ఆర్తనాదాలు వినిపించాయి. శనివారం రాత్రి 11 గంటల 27 నిమిషాలకు పెళ్లి ఉండగా.. రాత్రి 10 గంటలకు పెళ్లి కుమారుడు చనిపోయాడు. వరుడు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం అలుముకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
bridegrrom death


వివరాలివీ.. మహబూబాబాద్ జిల్లా ఆమనగల్ గ్రామానికి చెందిన బైరబోయిన మల్లయ్య, మల్లమ్మ దంపతుల కుమారుడు నరేష్ (25). ఇతనికి నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో వివాహం కుదిరింది. 8వ తేదీ శనివారం రాత్రి 11 గంటల 27 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు.

Must Read: కరోనాపై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. మరో నెలలో..

పెళ్లికి ముందే వరుడు నరేష్ తనకు ఆరోగ్యం బాగా లేదని చెప్పడంతో తల్లిదండ్రులు స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించి ఇంటికి తీసుకువచ్చారు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వరుడు ఆ నిద్రలోనే చనిపోయాడు. పడుకున్న వరుడు లేవకపోవడంతో మళ్లీ వైద్యుడ్ని పిలిచి పరీక్షించారు. కానీ అప్పటికే వరుడు చనిపోయాడని ధ్రువీకరించారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.