యాప్నగరం

Hyd: లాక్‌డౌన్‌లో రిసెప్షన్ పార్టీ.. వరుడిపై కేసు నమోదు

Lockdown నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌లో ఓ వ్యాపారి తన కుమారుడి పెళ్లి రిసెప్షన్ వేడుక నిర్వహించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వరుడితో పాటు అతడి కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు.

Samayam Telugu 18 May 2020, 11:57 pm
రోనా వైరస్ కట్టడి కోసం లాక్‌డౌన్ విధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల నిర్వహణపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదని ప్రభుత్వం ఆదేశించింది. తప్పనిసరి పరిస్థితుల్లో వివాహం జరపాల్సి వస్తే.. కేవలం 10 మంది కుటుంబ సభ్యులతో నిరాడంబరంగా ఆ తంతు ముగించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే.. ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ హైదరాబాద్‌లో ఓ వరుడి కుటుంబం రిసెప్షన్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
Samayam Telugu నమూనా చిత్రం
Lockdown


హైదరాబాద్ నగరంలోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారి లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా 150 మందితో పెళ్లి రిసెప్షన్ వేడుక నిర్వహించాడు. ఆసిఫ్ నగర్‌లోని జగదాంభ నగర్‌కు చెందిన ఫర్నీచర్ వ్యాపారి నర్సింగ్ రావు.. లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా తన కుమారుడు కిషోర్ కుమార్ పెళ్లి రిసెప్షన్ పార్టీని నిర్వహిస్తునట్లు పోలీసులకు సమాచారం అందింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆ రిసెప్షన్ పార్టీని నిలిపివేయించారు. నిబంధనలు అతిక్రమించిన వ్యాపారితో పాటు అతడి కుమారుడిపై ఎపిడమిక్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బర్త్ డే వేడుకలు నిర్వహించడం వల్ల సుమారు 30 మంది కరోనా బారిన పడిన నేపథ్యంలో ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: కాళేశ్వరం సహా గోదావరి ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు.. జల జగడం తారాస్థాయికి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.