యాప్నగరం

ప్రశ్నిస్తున్న ఏఎస్‌ఐని తోసేసి పరారైన కారు డ్రైవర్.. టోలిచౌకిలో బీభత్సం

Hyderabad: తనిఖీలు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐతో ఓ కారు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. ప్రశ్నిస్తున్న అధికారిని తోసేసి పరారయ్యాడు. ఈ ఘటనలో ఏఎస్‌ఐతో పాటు మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.

Samayam Telugu 24 Mar 2020, 11:16 pm
లాక్‌డౌన్‌ వేళ విధుల్లో ఉన్న పోలీస్ అధికారి పట్ల ఓ కారు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. తనిఖీల్లో భాగంగా వాహనాన్ని నిలిపేసి ప్రశ్నిస్తున్న ఏఎస్‌ఐని తోసేసి కారుతో ఉడాయించాడు. ఈ ఘటనలో ఏఎస్‌ఐ చేతికి గాయమైంది. గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని టోలిచౌకిలో మంగళవారం (మార్చి 24) ఈ ఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu toli chowki


టోలిచౌకిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. మెహిదీపట్నం వైపు నుంచి హోండా కారులో వచ్చిన వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కారు ఆపి ప్రశ్నిస్తున్న అడిషనల్‌ ఎస్‌ఐ రాజేష్‌‌ను తోసేసి పరారయ్యాడు. దీంతో ఆయన కింద పడిపోవడంతో ఎడమచేతికి తీవ్ర గాయమైంది. కారును ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌ హేమంత్‌ రెడ్డికి కూడా గాయాలయ్యాయి.

విధుల్లో ఉన్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన కారు డ్రైవర్ వ్యవహరాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. సీసీటీవి ఫుటేజీల ఆధారంగా కారు నెంబర్‌‌ను గుర్తించి డ్రైవర్‌ను పట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు డ్రైవర్‌‌ను అరెస్ట్‌ చేసి, విచారిస్తున్నారు.

Also Read: లాక్‌డౌన్.. ఇక ఏ అవసరం వచ్చినా డయల్ 100

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.