యాప్నగరం

jagityal road accident: లారీని ఢీకొన్న కారు.. నలుగురు మృతి, మృతుల్లో ఇద్దరు చిన్నారులు

కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ఇందులో నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతుల్లో ఆరు నెలల చిన్నారి కూడా ఉంది.

Samayam Telugu 9 Nov 2020, 7:25 am
తెలంగాణలో రహదారులు నెత్తురోడాయి. జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.‌ కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో ఆగి ఉన్న లారీని, కారు ఢీ కొట్టడంతో కారు ఉన్న నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. మృతులు క్షతగాత్రుల మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన వారుగా గుర్తించారు. మృతుల్లో లత ,రమాదేవి , 6 నెలల బాబు ఉన్నారు.
Samayam Telugu జగిత్యాల రోడ్డు ప్రమాదం
jagityal road accident


Read More: రెండోసారి ప్రియురాలికి గర్భం.. అబార్షన్ చేసుకుంటేనే పెళ్లి అన్న ప్రియుడు

ఈ ప్రమాదంలో గాయపడ్డ శ్రీనివాస్, సృజన్, శ్రుతి, శిరీష అనే ముగ్గురు పరిస్థితి సీరియస్ గా ఉంది. వీరిందర్నీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ఉదయం సారంగపూర్ మండలం పెంబట్ల వెళ్లిన కుటుంబ సభ్యులు, రాత్రి చల్ గల్ నుంచి మల్లాపూర్ వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు.‌ మృతుల్లో ఆరునెలల చిన్నారి ఉండటం అందర్నీ కలిచివేస్తోంది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.