యాప్నగరం

కరీంనగర్‌లో కారు బీభత్సం.. నలుగురికి తీవ్రగాయాలు

హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళుతున్న ఓ కారు ప్రమాదానికి గురైంది. రోడ్డుపై అడ్డుగా వచ్చిన సైకిల్‌ను తప్పించబోయి ఓ కిరాణా షాపు పైకి దూసుకెళ్లింది. ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జయింది.

Samayam Telugu 12 Aug 2019, 12:32 pm
రీంనగర్‌లో సోమవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. రాజీవ్ రహదారిపై వేగంగా వెళుతున్న ఓ కారు.. సైకిల్‌ను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న కిరాణా షాపు పైకి దూసుకెళ్లింది. ఈ ఘటన జిల్లాలోని గన్నేరువరం మండలం గుండ్లపల్లి వద్ద చోటు చేసుకుంది. కారు హైదరాబాద్ నుంచి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

సైకిల్ అడ్డురావడంతో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కిరాణాషాపు పైకి సుమారు 6 అడుగుల ఎత్తుకు దూసుకెళ్లింది. ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా , షాపు పూర్తిగా ధ్వసం అయింది. కారుతో సహా అందులోని ఆరుగురు వ్యక్తులు సుమారు 40 నిమిషాలపాటు షాపుపైన ఉన్నారు. వారిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు జేసీబీ సహాయంతో కారు కిందకి దించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణం నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.