యాప్నగరం

లాక్‌డౌన్ ఉల్లంఘించారని తెలంగాణ ఎమ్మెల్యేపై కేసు

Lockdown updates: లాక్ డౌన్ నేపథ్యంలో పనులు లేక చాలా మంది వలస కార్మికులు, పేదలు ఇబ్బంది పడుతుంటే భద్రాచలం జగదీశ్ కాలనీలో ఉన్న వారికి నిత్యావసరాల పంపిణీ జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది.

Samayam Telugu 16 Apr 2020, 5:03 pm
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పోడెం వీరయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే అయిన ఈయనతోపాటు స్వచ్ఛంద సంస్థలకు చెందిన 25 మందిపై కేసులు పెట్టారు. అయితే, లాక్ డౌన్ నిబంధనలను అడ్డుపెట్టుకొని కరోనా పేరుతో కూడా ఇలా కేసులు మోపి రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.
Samayam Telugu podem veeraiah


Must Read: undefined

లాక్ డౌన్ నేపథ్యంలో పనులు లేక చాలా మంది వలస కార్మికులు, పేదలు ఇబ్బంది పడుతుంటే భద్రాచలం జగదీశ్ కాలనీలో ఉన్న వారికి నిత్యావసరాల పంపిణీ జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది. సరిగ్గా ఇక్కడికి కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య కూడా హాజరయ్యారు. ఈ నిత్యావసరాల పంపిణీలో సామాజిక దూరం పాటించడంలేదని పేర్కొంటూ లాక్ డౌన్ నిబంధనల పేరుతో పోలీసులు కేసు నమోదు చేశారు. స్వచ్ఛందంగా సేవ చేయడానికి వస్తే దాన్ని రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే వీరయ్య ఖండించారు.

Also Read: అక్కడ అదనపు బలగాలు దించండి.. లేదా కంట్రోల్ కాదు.. మంత్రి కేటీఆర్ ఆదేశాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.