యాప్నగరం

ప్రగతి భవన్‌లో శునకం మృతి.. డాక్టర్లపై కేసు నమోదు

CM KCR అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో శునకం మరణించిన ఘటనపై వెటర్నరీ డాక్టర్ మీద కేసు నమోదైంది. ఈ అంశం తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Samayam Telugu 14 Sep 2019, 4:54 pm
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాసం ప్రగతి భవన్‌లో ఓ శునకం మృతి చెందిన అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనలో వెటర్నరీ డాక్టర్‌పై కేసు నమోదు చేయడమే ఇందుక్కారణం. తెలంగాణలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
Samayam Telugu bhavan


ప్రగతి భవన్‌లో మంగళవారం (సెప్టెంబర్ 10) పదకొండు నెలల హస్కీ అనే కుక్క మరణించింది. శునకం మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ పోలీసు కేసు నమోదైంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ ఘటనను తన విమర్శనాస్త్రంగా వినియోగించుకున్నారు.

Don't Miss: పోలీసుల ముందే డ్యాన్స్.. ట్యాంక్ బండ్‌పై మహిళ అత్యుత్సాహం

సెప్టెంబర్ 10న సాయంత్రం వరకు బాగానే ఆడిన శునకం ‘హస్కీ’.. రాత్రి తిండి తినలేదని ప్రగతి భవన్ సిబ్బంది తెలిపారు. మరుసటి రోజు ఉదయం కూడా పాలు తాగలేదని వెల్లడించారు. దీంతో ఉదయం 11 గంటలకు పశువైద్యుడికి సమాచారం అందించారు. ప్రగతి భవన్‌లో శునకాల ఆరోగ్యాన్ని రోజూ పరీక్షించే పశువైద్యుడు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వచ్చి హస్కీని పరీక్షించాడు.

హస్కీ 101 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యుడు అదే రోజు రాత్రి యానిమల్‌ కేర్‌ క్లినిక్‌లో చేర్పించారు. కానీ, శ్వాస అందక ఆ శునకం కాసేపటికే మరణించింది. శునకానికి చికిత్స అందించడంలో డాక్టర్‌ రంజిత్‌, ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్ లక్ష్మి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు 429, 11(4) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.