యాప్నగరం

మురుగు నీటిలోనూ కరోనా ఆనవాళ్లు.. సీసీఎంబీ పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

CCMB Hyderabad: కరోనా వైరస్‌కు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా సోకిన వారు విసర్జించిన మలమూత్రాల్లో కూడా వైరస్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు.

Samayam Telugu 20 Aug 2020, 5:03 pm
కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతున్న అంశంపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. పరిశోధనల్లో రోజురోజుకి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుందనే అంశాలు ఇప్పటి వరకూ పరిశోధకులు గుర్తించారు. తాజాగా వైరస్ వ్యాప్తి మరో విధంగానూ జరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Drinage in hyderabad


Also Read: undefined

ఇప్పటి వరకూ కరోనా వైరస్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని తెలుసు. కరోనా వైరస్ రోగి వాడిన వస్తువులు వాడడం లేదా తాకిన చోట తాకితే వైరస్ సంక్రమిస్తుంది. అయితే తాజాగా ముక్కు, నోటి ద్వారా కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు. మురుగునీటిలో కరోనా వైరస్‌ ఆనవాళ్లు ఉన్నాయని తాము గుర్తించినట్లు సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్త పరిశోధనల్లో తేల్చారు. మురుగునీటి నమూనాలను పరిశీలించి కరోనా వైరస్‌ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వ్యాధి సోకిన 35 రోజుల వరకు పేషెంట్ శరీరంలో వైరస్‌ ఉంటుందని తద్వారా విసర్జితాల్లోనూ వైరస్ ఉంటుందని సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్త పరిశోధనల్లో తేలింది.

Must Read: undefined

హైదరాబాద్‌లో దాదాపు 2 లక్షల మంది విసర్జితాలలో వైరస్ విడుదలైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే మురుగు నీటిలో వైరస్‌ ఉనికి గుర్తించినా ఇది వేరొకరికి సంక్రమించదని స్పష్టం చేశారు. సీసీఎంబీతో కలిసి సీఎస్‌ఐర్‌, ఐఐసీటీ తదితర సంస్ధలు చేసిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 80 శాతం మురుగు నీటి కేంద్రాల్లో వైరస్‌ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. సీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా నేతృత్వంలో శాస్త్రవేత్తలు ఉదయ్ కిరణ్, కుంచా సంతోష్ కుమార్, ఐఐసీటీ శాస్త్రవేత్తలు మనుపాటి హేమలత, హరీష్ శంకర్, వెంకట మోహన్ ఈ పరిశోధనలు చేశారు.

మరోవైపు, హైదరాబాద్ నగరంలో దాదాపు 6 లక్షల మంది కరోనా బారినపడినట్టు సీసీఎంబీ - సీఎస్‌ఐఆర్‌ సంయుక్త అధ్యయనంలో తేలింది. వీరిలో ఎక్కువ మందిలో కరోనా లక్షణాలు లేవని.. వారు ఆస్పత్రికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది.
ఈ పరీక్షలన్ని సీసీఎంబీ కరోనా పరీక్ష కేంద్రాలలో నిర్వహించారు.
Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.