యాప్నగరం

ఉదయాన్నే ఓటేసిన ప్రముఖులు వీరే.. సతీసమేతంగా చిరంజీవి.. వీడియో

GHMC Elections: మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఉదయం 8 గంటల లోపే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం జూబ్లీహిల్స్‌ క్లబ్‌‌కు చేరుకున్న చిరంజీవి దంపతులు ఓటు వేశారు.

Samayam Telugu 1 Dec 2020, 8:59 am
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ సాగనుంది. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 7 గంటలకే తొలి ఓటును వేశారు. ఆయన సతీసమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు.
Samayam Telugu ఓటేసిన చిరంజీవి దంపతులు
Chiranjeevi Voting


కుందన్‌బాగ్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ ఓటు వేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కాచిగూడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీసమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన ఓటు వేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది సామాన్యుడి పాశుపతాస్త్రం అని ఆయన అన్నారు. సామాన్య పౌరుడు నుంచి రాష్ట్రపతి వరకూ ఓటే ఒక ఆయుధం అని చెప్పారు. మంచి నేతలు కావాలంటే ఓటు ద్వారానే సాధ్యం, ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. శాస్త్రిపురలో ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జూబ్లీహిల్స్‌లో చిరంజీవి దంపతులు
మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఉదయం 8 గంటల లోపే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం జూబ్లీహిల్స్‌ క్లబ్‌‌కు చేరుకున్న చిరంజీవి దంపతులు ఓటు వేశారు. ఫిల్మ్‌నగర్‌ క్లబ్బులో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో మల్లెమాల శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి, సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ, ఓటు వేశారు. హీరో నాగశౌర్య తల్లి, నిర్మాత ఉష మూల్పూరి షేక్‌పేట్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.