యాప్నగరం

Delhi AIIMS: ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

G Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పి కారణంగా అస్వస్థతకు గురైన ఆయన ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 1 May 2023, 9:20 am

ప్రధానాంశాలు:

  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అస్వస్థత
  • ఢిల్లీ ఎయిమ్స్‌లో అడ్మిట్
  • ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu G Kishan Reddy
కిషన్ రెడ్డి
G Kishan Reddy Admitted Hospital: కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి కారణంగా ఆదివారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్‌ (Delhi AIIMS) ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కార్డియాక్ కేర్ యూనిట్‌లో ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనకు టెస్టులు నిర్వహించారు. ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యగా నిర్ధారించిన డాక్టర్లు చికిత్స అందించారు. కడుపులో గ్యాస్ సమస్య వల్ల ఛాతీ నొప్పి వచ్చిందని చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు వెల్లడించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.
ఎన్నికల సమీపిస్తున్న వేళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. తీరక లేకుండా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గంగా పుష్కర యాత్ర.. పూరీ - కాశీ - అయోధ్య భారత్ గౌరవ్ టూరిస్టు రైలును ఆయన ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా ఆయన ఆదివారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ ప్రాంగణంలో మన్ కీ బాత్ కార్యక్రమం జరగ్గా.. అందులో పాల్గొన్నారు. మోదీ ప్రస్తావించిన అంశాల ఆధారంగా ఆర్ట్ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్‌ను కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో కలిసి ఆయన ప్రారంభించారు.

అనంతరం ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసలు కురిపంచారు. మన్ కీ బాత్ కార్యక్రమం దేశ సంస్కృతిని, వారసత్వాన్ని, చరిత్రను తెలియజేస్తుందని చెప్పారు. ఆ తర్వాత ఢిల్లీలోని అధికారిక నివాసానికి చేరుకున్న కిషన్ రెడ్డి.. రాత్రి 11 గంటల సమయంలో అస్వస్థతకు గురయ్యారు. ఉదయం నుంచి చాలా హుషారుగా ఉన్న ఆయన.. ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సిబ్బంది ఆయన్ను ఢిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.