యాప్నగరం

Kishan Reddy: ప్రధాని మోదీతో కేసీఆర్‌కు పోలికా.. దేశంలో కాదు తెలంగాణలో మార్పు తథ్యం: కిషన్ రెడ్డి

Kishan Reddy On KCR : బెంగళూరు పర్యటన సందర్భంగా సంచలన వార్త వింటారని సీఎం కేసీఆర్‌ చెప్పారని, గతంలో కూడా ఇలాగే అనేక వ్యాఖ్యలు చేసినా వాటిని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎం చెబుతున్న ప్రళయాలు, భూకంపాలకు భయ పడేవారెవరూ లేరని చెప్పుకొచ్చారు.

Authored byRaj Kumar | Samayam Telugu 28 May 2022, 8:35 am

ప్రధానాంశాలు:

  • మోదీ రోజుకు 18 గంటలు పనిచేస్తే.. కేసీఆర్ నెలకు 18 గంటలే
  • దేశ రాజకీయాల కంటే ముందు కేసీఆర్ వైఖరిలో గుణాత్మక మార్పు
  • మోదీని విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదని కిషన్ రెడ్డి కౌంటర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కిషన్ రెడ్డి
దేశంలో త్వరలోనే గుణాత్మక మార్పు వస్తుందో.. రాదో తెలియదు కానీ రాష్ట్రంలో మాత్రం మార్పు రావడం తథ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బెంగళూరు పర్యటన సందర్భంగా సంచలన వార్త వింటారని కేసీఆర్‌ చెప్పారని, గతంలో కూడా కేసీఆర్‌ అనేక వ్యాఖ్యలు చేసినా వాటిని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు. సీఎం చెబుతున్న ప్రళయాలు, భూకంపాలకు భయ పడేవారెవరూ లేరన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనతో జనం విసిగిపోయారని అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీపై టీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. హుజురాబాద్‌లో వేల కోట్లు ఖర్చుపెట్టినా టీఆర్ఎస్ ఓటమిపాలైందని, అయినా ఆ పార్టీ మార్పు రాలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై కేంద్రం పన్నులు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్కు లేదన్నారు.

KTR In WEF: దావోస్‌లో ముగిసిన కేటీఆర్‌ టూర్‌.. రాష్ట్రానికి పెట్టుబడుల వరద
దేశ రాజకీయాల కన్నా ముందు కేసీఆర్ వైఖరిలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సిద్ధాంతపరంగా తాము కుటుంబ పార్టీలను వ్యతిరేకిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కుటుంబ పాలనతో దేశం భ్రష్టుపట్టి పోతోందన్నారు. కేసీఆర్‌ ప్రతీసారి ప్రధాని మోదీని టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతున్నారని, రోజుకు 18 గంటలు పనిచేసే ప్రధానికి, నెలకు 18 గంటలు పని చేసే కేసీఆర్‌కు పోలికే లేదని సెటైర్ వేశారు.

మోదీని విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. కుటుంబ పార్టీలకు, కల్వకుంట్ల కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. బీజేపీ అధ్యక్షుడిని మూడేళ్లకోసారి ఎన్నుకుంటామని, ఇప్పటి అధ్యక్షుడు నడ్డా కుమారుడు తర్వాత అధ్యక్షుడు కాలేరని, ప్రధానిగా కూడా మోదీ కుటుంబం నుంచి ఉండబోరని స్పష్టం చేశారు. కేంద్రం నుండి నిధులు రాకుండానే రాష్ట్రం ప్రగతిపథంలో ఎలా ముందుకెళ్తోందని ఆయన ప్రశ్నించారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.