యాప్నగరం

అమ్మ మనసు గాయపడింది.. కోడలి విషయంలో కొడుకు కోప్పడ్డాడని.. ఊహించని శిక్ష

కొడుకు కోప్పడ్డాడని ఓ తల్లి తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. కోడలిపై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు కొడుకు తిట్టడంతో ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

Samayam Telugu 30 May 2020, 9:29 am
కన్న కొడుకు తిట్టాడనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన చందానగర్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గోపన్ పల్లికి చెందిన యాదమ్మ (48) ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. లాక్‌డౌన్ కారణంగా ఇళ్లలో పనులు చేయడం కుదరకపోవడంతో.. కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. ఆమె కుమారుడు రంగస్వామి కారు వాషింగ్ సెంటర్లో పని చేస్తున్నాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


రంగస్వామి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఏదో విషయమై యాదమ్మ కోడలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తల్లి తన భార్యను తిట్టడాన్ని సహించలేకపోయిన రంగస్వామి యాదమ్మపై ఆగ్రహం వ్యక్తం చేసి దుర్భాషలాడాడు. కొడుకు తిట్టడంతో ఆ తల్లి మనస్తాపానికి గురైంది. గురువారం రాత్రి తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం ఎంత సేపటికీ తలుపు తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా.. ఉరివేసుకొని కనిపించింది.

అల్లారుముద్దుగా పెంచుకున్న తన కొడుకు పెద్దయ్యాక భార్య మీద ప్రేమతో తనను తిట్టడంతో.. ఆ తల్లి మనసు గాయపడింది. తను ఈ లోకాన్ని విడిచి వెళ్లి.. కొడుక్కి జీవితాంతం మర్చిపోలేని శిక్ష విధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.