యాప్నగరం

GHMC ప్రచారంలో కనిపించని చంద్రబాబు, లోకేశ్, బాలయ్య.. అసలు కారణాలివే..!

Telangana Telugu Desam Party: తెలుగు రాష్ట్రాలు విడిపోయాక జరిగిన అన్ని ప్రధాన ఎన్నికల్లోనూ చంద్రబాబు, బాలకృష్ణ టీడీపీ తరపున హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించేవారు.

Samayam Telugu 27 Nov 2020, 12:05 pm
జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ప్రచార వేడి తారస్థాయికి చేరుకున్న వేళ అన్ని పార్టీలకు చెందిన అగ్ర నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలతో హోరెత్తిస్తున్నారు. కానీ, తెలంగాణ తెలుగు దేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బాలకృష్ణ వంటి వారు మాత్రం ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. సాధారణంగా తెలుగు రాష్ట్రాలు విడిపోయాక జరిగిన అన్ని ప్రధాన ఎన్నికల్లోనూ చంద్రబాబు టీడీపీ తరపున హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించేవారు. కానీ, ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలకు మాత్రం వారు దూరంగా ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Samayam Telugu లోకేశ్, చంద్రబాబు (ఫైల్ ఫోటోలు)
Chandrababu and nara lokesh


జీహెచ్ఎంసీ ఎన్నికలకు మొత్తం ప్రచార బాధ్యత తెలంగాణ తెలుగు దేశంపైనే ఉన్నట్లు కనిపిస్తోంది. టీడీపీకి జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శులైన చంద్రబాబు, లోకేశ్ ఎన్నికల ప్రచారంలో ఏ మాత్రం జోక్యం చేసుకోవడం లేదు. దీనిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్ వంటి నాయకులు హైదరాబాద్‌లో పార్టీ తరపున ప్రచారంలో పాల్గొని ఉంటే క్యాడర్‌లో మంచి ఉత్సాహాన్ని నింపి ఉండే మాట వాస్తవమే. కానీ, ఇలా చేసి కూడా రేపు ఫలితాల తర్వాత టీడీపీకి వచ్చిన ఓట్ల శాతం మరీ దారుణంగా ఉంటే అది ఏపీలో కచ్చితంగా రాజకీయంగా ప్రభావం చూపుతుంది.

Also Read: అడ్డంగా బుక్కైన బీజేపీ.. ‘ఏమిరా బాలరాజు’ అంటూ బీభత్స ట్రోల్స్, కేటీఆర్ అదిరే ట్వీట్

అంతేకాకుండా, టీడీపీతో ఇక్కడ పొత్తు పెట్టుకొనేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకున్నందుకు ఎదురైన ఘోర పరాభవమే ఇందుకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాక, కాంగ్రెస్ లాంటి పార్టీతో కలిసినందుకు ఏపీలో టీడీపీకి భారీ నష్టం వాటిల్లింది. ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసిన పార్టీతో చంద్రబాబు కలిశారంటూ ఏపీ ప్రజల్లో బాగా వ్యతిరేకత ఎదురైంది. అప్పుడు టీడీపీ అగ్ర నేతలు కనీసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నా దాని వల్ల లాభం కన్నా తీవ్ర స్థాయిలో న‌ష్టమే మిగిలింది.

మొత్తానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలపర్చేందుకు ఎలాంటి వ్యూహరచన చేయలేకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇక్కడ పార్టీ బలోపేతానికి ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నా ఏపీలో దాని ప్రభావం పార్టీపై నేరుగా పడుతుంది. కాబట్టి, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణలో టీటీడీపీ వ్యూహరచన చేయగలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.