యాప్నగరం

చార్మినార్, గోల్కొండ సందర్శనకు బ్రేక్..

చార్మినార్, గోల్కొండ సందర్శనకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఈ రెండు ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో సందర్శనను నిలిపేసింది.

Samayam Telugu 7 Jul 2020, 11:11 am
చార్మినార్, గోల్కొండ కోట సందర్శనను పురావస్తుశాఖ అధికారులు నిలిపివేశారు. సోమవారం నుంచి ఈ రెండు చారిత్రక కట్టడాలను సందర్శించడానికి పురావస్తు శాఖ అనుమతి ఇచ్చింది. కానీ ఈ రెండు కట్టడాలు కంటైన్మెంట్ జోన్‌లో ఉండటంతో ప్రభుత్వ సూచనల మేరకు నిలిపేస్తున్నామని ప్రకటించింది. ఈ నెల చివరి వారంలో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. జులై 6 నుంచి చార్మినార్, గోల్కొండ సందర్శనకు అనుమతిస్తామని అంతకు ముందు పురావస్తు శాఖ ప్రకటించింది. ఆన్‌లైన్ ద్వారా టికెట్ల విక్రయం ప్రారంభించడంతో.. కొందరు టికెట్లను కొనుగోలు చేశారు.
Samayam Telugu Charminar: Photo/ BCCL


సోమవారం మధ్యాహ్నం వరకు ఆశించిన స్థాయిలో సందర్శకులు రాలేదు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించిన పురవాస్తు శాఖ అధికారులు.. సందర్శనను నిలిపేశారు. ఈ ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్ పరధిలో ఉన్నప్పటికీ.. పర్యాటకులను ఎలా అనుమతిస్తారని స్థానికులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

మధ్యాహ్నం సమయంలో చార్మినార్‌ను సందర్శించిన పోలీసులు.. చార్మినార్‌పైకి ఎక్కడానికి ఇరుకైన మెట్ల మార్గం ఉండటంతో భౌతిక దూరం పాటించడం కుదరదని తెలిపారు. దీంతో సందర్శకులను అనుమతించడాన్ని వాయిదా వేశారు. దేశవ్యాప్తంగా చారిత్రక కట్టడాల సందర్శనకు పురావస్తు శాఖ అనుమతి ఇచ్చింది. కానీ ఆగ్రాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజ్‌మహల్ సందర్శనకు మాత్రం అనుమతించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.