హైదరాబాద్లో చికెన్ ధర ఆల్ టైం రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇప్పటి వరకూ సమ్మర్లో కిలో చికెన్ రూ. 246 నమోదు కావడమే అత్యధికం కాగా.. ఈ సీజన్లో రూ. 260కి చేరువైంది. శుక్రవారం కిలో స్కిన్లెస్ ధర రూ.257గా నమోదైంది. వామ్మో అనుకుంటున్నారా.. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 2017 మే నెల చివర్లో రంజాన్ డిమాండ్ కారణంగా చికెన్ ధరలు కిలో రూ.240 దాటాయి.
కరోనా ఎఫెక్ట్తో ఈ ఏడాది ఆరంభంలో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. చికెన్ తింటే కరోనా సోకుతుందనే భయాందోళనలతో జనం కోడి మాంసం తినడం మానేశారు. దీంతో ఒక దశలో వంద రూపాయలకే కిలో చొప్పున చికెన్ను విక్రయించారు. కొందరు పౌల్ట్రీ రైతులు కోళ్లను తక్కువ ధరకే ఇచ్చేశారు.
కోవిడ్ ప్రభావంతో ధరలు తగ్గిపోవడం, డిమాండ్ లేకపోవడంతో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించేశారు. గతంలో రాష్ట్రంలో ప్రతి నెలా 4 కోట్లకుపైగా కోడి పిల్లను పెంచేవారు. ప్రస్తుతం 2 కోట్ల కోడి పిల్లలను మాత్రమే పెంచుతున్నారు. కోళ్ల పెంపకం సగానికి పడిపోవడం, ఎండల కారణంగా కోళ్లు బరువు తక్కువ తూగుతుండటం.. మరోవైపు చికెన్ పట్ల సామాన్యులు ఆసక్తి చూపుతుండటంతో.. మళ్లీ డిమాండ్ పెరిగింది. దీంతో ధర భారీగా పెరిగింది.
కోళ్ల ఫారాల వద్ద నేడు (శనివారం) కిలో చికెన్కు రూ.145 చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో ఆదివారం చికెన్ ధర రూ.260 దాటే అవకాశం ఉంది. చికెన్ ధర పెరిగినా.. పెంపకందారులకు గతంలో వచ్చిన నష్టాలతో పోలిస్తే.. ఇప్పుడు వచ్చే లాభాలు తక్కువే. హోటళ్లు, రెస్టారెంట్లు తెరిస్తే.. కోళ్ల పెంపకం పూర్వ స్థితికి చేరుకునే అవకాశం ఉంది.
కోడి పిల్లలు ఎండ వేడిమికి తట్టుకోలేవు. ఇవి గరిష్టంగా 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకోగలవు. దీంతో కోళ్ల ఫారంల నిర్వాహకులు స్ప్రింకర్లను, షేడ్ నెట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఉష్ణతాపం నుంచి బయటపడటం కోసం కోళ్లు ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల ఆహారం తీసుకోవడాన్ని తగ్గిస్తాయి. దీంతో బరువు తక్కువ తూగుతాయి.
కరోనా ఎఫెక్ట్తో ఈ ఏడాది ఆరంభంలో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. చికెన్ తింటే కరోనా సోకుతుందనే భయాందోళనలతో జనం కోడి మాంసం తినడం మానేశారు. దీంతో ఒక దశలో వంద రూపాయలకే కిలో చొప్పున చికెన్ను విక్రయించారు. కొందరు పౌల్ట్రీ రైతులు కోళ్లను తక్కువ ధరకే ఇచ్చేశారు.
కోవిడ్ ప్రభావంతో ధరలు తగ్గిపోవడం, డిమాండ్ లేకపోవడంతో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించేశారు. గతంలో రాష్ట్రంలో ప్రతి నెలా 4 కోట్లకుపైగా కోడి పిల్లను పెంచేవారు. ప్రస్తుతం 2 కోట్ల కోడి పిల్లలను మాత్రమే పెంచుతున్నారు. కోళ్ల పెంపకం సగానికి పడిపోవడం, ఎండల కారణంగా కోళ్లు బరువు తక్కువ తూగుతుండటం.. మరోవైపు చికెన్ పట్ల సామాన్యులు ఆసక్తి చూపుతుండటంతో.. మళ్లీ డిమాండ్ పెరిగింది. దీంతో ధర భారీగా పెరిగింది.
కోళ్ల ఫారాల వద్ద నేడు (శనివారం) కిలో చికెన్కు రూ.145 చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో ఆదివారం చికెన్ ధర రూ.260 దాటే అవకాశం ఉంది. చికెన్ ధర పెరిగినా.. పెంపకందారులకు గతంలో వచ్చిన నష్టాలతో పోలిస్తే.. ఇప్పుడు వచ్చే లాభాలు తక్కువే. హోటళ్లు, రెస్టారెంట్లు తెరిస్తే.. కోళ్ల పెంపకం పూర్వ స్థితికి చేరుకునే అవకాశం ఉంది.
కోడి పిల్లలు ఎండ వేడిమికి తట్టుకోలేవు. ఇవి గరిష్టంగా 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకోగలవు. దీంతో కోళ్ల ఫారంల నిర్వాహకులు స్ప్రింకర్లను, షేడ్ నెట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఉష్ణతాపం నుంచి బయటపడటం కోసం కోళ్లు ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల ఆహారం తీసుకోవడాన్ని తగ్గిస్తాయి. దీంతో బరువు తక్కువ తూగుతాయి.