యాప్నగరం

కరోనా ఎఫెక్ట్: మళ్లీ కొండెక్కుతున్న చికెన్ ధరలు

Poultry Industry: ఇలా కోళ్ల ఫారాల యజమానులు కోళ్లను బాగా తగ్గించుకోవడంతో ఇప్పుడు ఉత్పత్తి బాగా తగ్గింది. దీంతో ఇపుడు చికెన్‌ ధర అమాంతంగా పెరుగుతోంది.

Samayam Telugu 28 Mar 2020, 12:47 pm
కరోనా వైరస్ ప్రభావం వల్ల బాగా పడిపోయిన చికెన్ ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. మొన్నటిదాకా కరోనా ప్రభావంతో జనాలు చికెన్‌ తినాలంటేనే భయపడ్డారు. దీంతో చికెన్‌ ధర పూర్తిగా పడిపోయింది. అదే సమయంలో కోళ్లకు వ్యాధి సోకడంతో చాలా చోట్ల అవి చనిపోయాయి. కనీస గిట్టుబాటు ధర లేకపోవడంతో యజమానులు ఫారాల్లో జబ్బు పడ్డ కోళ్లను తీసుకెళ్లిపోయి గోతుల్లో పూడ్చి పెట్టారు. మరికొన్ని చోట్ల కోళ్లను ఉచితంగా పంచి పెట్టారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Samayam Telugu chicken-shop khairatabad


ఇలా కోళ్ల ఫారాల యజమానులు కోళ్లను బాగా తగ్గించుకోవడంతో ఇప్పుడు ఉత్పత్తి బాగా తగ్గింది. దీంతో ఇపుడు చికెన్‌ ధర అమాంతంగా పెరుగుతోంది. కరోనా భయంతో సిద్దిపేట జిల్లాలో బాయిలర్‌ కోళ్ల ఫారాలు 40 మాత్రమే మిగిలాయని వ్యాపారులు తెలిపారు. కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో చికెన్‌ ధరలు మళ్లీ పూర్వపు స్థితికి చేరుకున్నాయని అంటున్నారు. ధరలు పూర్వపు ధరలను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు అంచనా వేస్తున్నారు.

Also Read: అలీబాబా.. ఒక దొంగ.. కరోనా వల్ల లక్షలు కోల్పోయిన హైదరాబాదీ డాక్టర్‌

చికెన్‌ సెంటర్లలో బ్రాయిలర్‌ ఫారాల్లో లైవ్‌ కోడి కిలోకు రూ.70 ఉన్నట్లు, స్కిన్‌తో ఉండే చికెన్‌ కిలోకు రూ.160, స్కిన్‌లెస్‌ కిలోకు రూ.190కి విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. కరోనా ప్రభావంతో చికెన్‌ సెంటర్లు ఇంకా పూర్తిస్థాయిలో తెరుచుకోలేదని, కరోనా భయం తొలగి చికెన్‌ తినేవారు పెరిగితే ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో కిలో చికెన్ రూ.200 కు అమ్ముతున్నారు. కోడి గుడ్లు కూడా డజను రూ.45 నుంచి రూ.50 మధ్య ధర ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.