రాజ్భవన్లో CJI ఎన్వీ రమణ.. గవర్నర్, సీఎం కేసీఆర్ ఘన స్వాగతం
Telangana Raj Bhavan: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు పలువురు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
Samayam Telugu 11 Jun 2021, 6:28 pm
ప్రధానాంశాలు:
- రాజ్ భవన్కు సీజేఐ
- ఘన స్వాగతం పలికిన గవర్నర్, కేసీఆర్
- రాత్రికి అక్కడే బస
Chief Justice of India: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆ హోదాలో తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. శుక్రవారం సాయంత్రం ఆయన తెలంగాణ రాజ్భవన్కు చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు పలువురు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి చీఫ్ జస్టిస్ కారులో తెలంగాణ రాజ్ భవన్కు చేరుకున్నారు.
తిరుమలలో దర్శనం
శుక్రవారం ఉదయం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆయన ఆలయానికి విచ్చేసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం వద్ద జస్టిస్ రమణకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకకులు వేణుగోపాల దీక్షితులు, ఇతర అర్చకస్వాములు ఆయనకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారి ఆశీస్సులతోనే ఈ స్థాయికి చేరుకున్నానని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
తిరుమలలో దర్శనం
శుక్రవారం ఉదయం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆయన ఆలయానికి విచ్చేసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం వద్ద జస్టిస్ రమణకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకకులు వేణుగోపాల దీక్షితులు, ఇతర అర్చకస్వాములు ఆయనకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారి ఆశీస్సులతోనే ఈ స్థాయికి చేరుకున్నానని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.