యాప్నగరం

రాష్ట్రపతికి చిలుకూరు అర్చకుడు రంగరాజన్‌ లేఖ

Chilkur Balaji Temple: ఈ విషయాన్ని ఆయన స్వయంగా విలేకరులకు తెలిపారు. కేరళ అనంతపద్మనాభ స్వామి దేవాలయం కేసు వ్యవహరంలో సుప్రీంకోర్టు తన తీర్పును పలు మార్లు ఎందుకు వాయిదా వేస్తుందో అర్థం కావడం లేదని తెలిపారు.

Samayam Telugu 30 Jun 2020, 2:27 pm
చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం సంధానకర్త అయిన సీఎస్ రంగరాజన్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం కేసు విషయమై ఆయన రాష్ట్రపతికి లేఖ రాశారు. సోమవారం ఈ విషయాన్ని ఆయన స్వయంగా విలేకరులకు తెలిపారు. కేరళ అనంతపద్మనాభ స్వామి దేవాలయం కేసు వ్యవహరంలో సుప్రీంకోర్టు తన తీర్పును పలు మార్లు ఎందుకు వాయిదా వేస్తుందో అర్థం కావడం లేదని తెలిపారు. గతంలోనూ శబరిమల ఆలయం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును విరుద్ధంగా ఇచ్చిన విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించినట్లు ఆయన వివరించారు. ఇదే తరహాలో పూరీ జగన్నాథ్‌ రథయాత్ర నిర్వహించొద్దని తీర్పు ఇచ్చి.. తర్వాత ప్రజల ఆగ్రహం నేపథ్యంలో అనుమతించిన విషయాన్ని గుర్తు చేశారు.
Samayam Telugu సీఎస్ రంగరాజన్
cs rangarajan chilkur


ప్రజాగ్రహం వ్యక్తమయ్యాక సుప్రీంకోర్టు పరిమిత సంఖ్యలో భక్తులతో రథయాత్ర చేసుకోవచ్చని తీర్పును మార్చుకుందని తెలిపారు. ఇలాంటి వాటితో న్యాయస్థానంపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం మసకబారుతుందని రంగరాజన్ మాట్లాడారు. హిందూ దేవతల విషయంలో సుప్రీంకోర్టు వ్యవహారశైలి సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 26 ప్రకారం దేవాలయాల్లో కొలువుండే దైవుళ్లకు అధికారాలు ఏమీ లేవని ఉందని, అందుకే భగవంతుడు కోవిడ్‌–19 నుంచి భక్తులను కాపాడే అధికారాన్ని కోల్పోయాడేమో అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి తన విశిష్ట అధికారాలను ఉపయోగించుకొని అనంత పద్మనాభ స్వామి దేవాలయం తీర్పును హిందువుల మనోభావాలకు అనుగుణంగా వెలువరించేలా సుప్రీంకోర్టును ఆదేశించాలని లేఖలో కోరినట్లు రంగరాజన్ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.