యాప్నగరం

Hyderabad: దొంగతనం కేసులో పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన

Hyderabad: దొంగతనం కేసులో పోలీసుల అదుపులో ఉన్న చిరంజీవి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో మృతి చెందటం కలకలం రేపుతోంది. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయగా.. రేపు రానున్న పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయాలు బయటపడే అవకాశముంది.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 26 Apr 2023, 11:43 am

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్‌లో తీవ్ర విషాదం
  • పోలీసుల అదుపులో ఉన్న చిరంజీవి అనే వ్యక్తి మృతి
  • దొంగతనం కేసులో అరెస్ట్ అయిన చిరంజీవి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu lb nagar
ఎల్బీ నగర్
Hyderabad: సికింద్రాబాద్‌ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుకారం గేట్ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు చిరంజీవి మృతి చెందాడు. దొంగతనం కేసులో నిందితుడుగా ఉన్న ఎల్బీనగర్ చెందిన చిరంజీవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే అనారోగ్యంతో చిరంజీవి పోలీస్ స్టేషన్‌లో పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో చిరంజీవి మరణించాడు.
చిరంజీవి చనిపోయిన విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. దీంతో సికింద్రాబాద్ డీసీపీ కార్యాలయం దగ్గర కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న కుటుంబసభ్యులను పోలీసు వాహనంలో గాంధీ హాస్పిటల్‌కు దౌర్జన్యంగా తరలించినట్లు విమర్శలొస్తున్నాయి. దీంతో గాంధీ హాస్పిటల్‌కు పోలీసులు భారీగా చేరుకుంటున్నారు. అనుమానాస్పదంగా మృతి చెందటంతో చిరంజీవి మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అందించే అవకాశముందని సమాచారం.

నేడు పోస్టుమార్టం నిర్వహిస్తే రేపు రిపోర్ట్ ఇచ్చే అవకాశముంది. దీంతో చిరంజీవి అనుమానాస్పద మృతికి సంబంధించి రేపు స్పష్టత వచ్చే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. అయితే చిరంజీవి అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసులు చెబుతుండగా.. ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేది బయటకు రాలేదు. దీంతో తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.