పాలు అనుకొని ఫినాయిల్ తాగి బాలుడు మృత్యువాతపడిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచిలో చోటు చేసుకుంది. కూసుమంచి మండలం తురకగూడేనికి చెందిన వడ్డెంపుల నగేశ్, నాగమణి దంపతుల తొమ్మిదేళ్ల కుమారుడు వెంకటేశ్ స్థానిక మండల పరిషత్తు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రోజూ ఉదయం పాఠశాలకు వెళ్లే ముందు బాలుడికి పాలు తాగడం అలవాటు.
జనవరి 11న రోజూలాగే స్కూల్కు బయలుదేరిన వెంకటేశ్.. వెళ్లే ముందు పాలు అనుకొని సీసాలో ఉన్న ఫినాయిల్ తాగాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గమనించలేదు. పాఠశాలకు వెళ్లిన కాసేపటికే వాంతులవడంతో బాలుడు ఇంటికి తిరిగొచ్చాడు. తల్లి నాగమణి బాలుడిని తీసుకొని స్థానికంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించింది.
Don't Miss: స్మార్ట్ఫోన్లతో జాగ్రత్త.. మహిళలే ఎక్కువగా ట్రాప్లోకి
పరిస్థితి విషమించడంతో బాలుడిని హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం (జనవరి 23) వేకువజామున వెంకటేశ్ ప్రాణాలు విడిచాడు. దీంతో తల్లి కన్నీరుమున్నీరైంది. నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన తెలుపుతోంది. ముఖ్యంగా క్రిమి, కీటకాల నివారణ కోసం ఉపయోగించే విష రసాయనాలను, ఇతర హానికర పదార్థాలను పిల్లలకు అందకుండా భద్రపరచాలి. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే విషాదమే మిగులుతుంది.
Also Read: వణికిస్తున్న కరోనా వైరస్.. హైదరాబాద్లో అలర్ట్
జనవరి 11న రోజూలాగే స్కూల్కు బయలుదేరిన వెంకటేశ్.. వెళ్లే ముందు పాలు అనుకొని సీసాలో ఉన్న ఫినాయిల్ తాగాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గమనించలేదు. పాఠశాలకు వెళ్లిన కాసేపటికే వాంతులవడంతో బాలుడు ఇంటికి తిరిగొచ్చాడు. తల్లి నాగమణి బాలుడిని తీసుకొని స్థానికంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించింది.
Don't Miss: స్మార్ట్ఫోన్లతో జాగ్రత్త.. మహిళలే ఎక్కువగా ట్రాప్లోకి
పరిస్థితి విషమించడంతో బాలుడిని హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం (జనవరి 23) వేకువజామున వెంకటేశ్ ప్రాణాలు విడిచాడు. దీంతో తల్లి కన్నీరుమున్నీరైంది. నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన తెలుపుతోంది. ముఖ్యంగా క్రిమి, కీటకాల నివారణ కోసం ఉపయోగించే విష రసాయనాలను, ఇతర హానికర పదార్థాలను పిల్లలకు అందకుండా భద్రపరచాలి. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే విషాదమే మిగులుతుంది.
Also Read: వణికిస్తున్న కరోనా వైరస్.. హైదరాబాద్లో అలర్ట్