యాప్నగరం

ఆన్‌లైన్ క్లాసులకు సెల్ ఫోన్ కొనలేదని.. విద్యార్థి ఆత్మహత్య

ఆర్థిక పరిస్థితి అంతంతగా ఉన్నా ఆ తల్లిదండ్రులు కొడుకు ఫోన్ కొనివ్వమని అడగ్గానే కొనివ్వలేకపోయారు. ఇప్పుడు కుదరదు అంటూ మందలించారు. దీంతో సాయిరాం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

Samayam Telugu 9 Sep 2020, 8:02 am
ఆ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతత మాత్రం. తండ్రి వ్యవసాయం చేస్తుంటే, తల్లి బీడీలు చుడుతూ కుటుంబానికి అండగా ఉంటుంది. కాయ కష్టం చేసి కుటుంబాన్ని చూసుకుంటున్నారు. ఇంతలో ఓ బిడ్డ ఆత్మహత్య వారిని పుట్టెడు దుఖ:లో పడేసింది. కన్న కొడుకు అడిగిన దాన్ని కొనిచ్చే ఆర్థిక స్థోమతలేక వారికి కడుపుకోత మిగిలింది. ఈ విషాదకరమైన ఘటన జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం కొల్వాయి గ్రామంలో చోటు చేసుకుంది.
Samayam Telugu విద్యార్థి ఆత్మహత్య
student suicide


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఆకుల రాజేశం, శంకరవ్వ దంపతులు. వీరికి ముగ్గురు కుమారుడు. రాజేశం గీత వృత్తితో పాటు వ్యవసాయం కూడా చేస్తున్నాడు. శంకరవ్వ కూడా బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సాఫీగా సాగుతున్న వీరి కుటుంబంలో స్మార్ట్ ఫోన్ తీవ్ర విషాదం నింపింది. చిన్న కుమారుడు సాయిరాం.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

Read More: మౌనరాగం సీరియల్ నటి ఆత్మహత్య.. టిక్ టాక్‌లో పరిచయం, తర్వాత వేధింపులతో

కరోనా కారణంగా స్కూల్‌లు మూతపడటంతో ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతున్నాయి. అయితే తనకు ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. అంత ఆర్థిక స్థోమత తమకు లేదన్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు ఫోన్ వద్దని తల్లిదండ్రులు వారించారు. దీంతో మనస్తాపం చెందిన సాయిరాం పాత ఇంట్లోకు వెళ్లి ఉరేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.