యాప్నగరం

Bhatti Vikramarka: బండి సంజయ్‌ది సంగ్రామ యాత్ర కాదు.. విషయాత్ర

Bhatti Vikramarka: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. దేశ ఆస్తులను అమ్ముతూ జాతిని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీని మునుగోడులో అడుగుపెట్టనివ్వకపోవడమే మంచిదన్నారు. ఎన్నికల వాగ్దానాలు హామీలను అమలు చేయని టీఆర్ఎస్ సర్కారుకు మునుగోడు ప్రజలు బుద్ది చెప్పాల్సిందేనన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను దూరం పెట్టి.. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతిని గెలిపిస్తేనే తెలంగాణలో సంక్షేమ రాజ్యం వస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 25 Sep 2022, 8:27 pm
Bhatti Vikramarka: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar) చేసింది సంగ్రామ యాత్ర (Praja Sangarama Yatra) కాదు.. విషయాత్ర అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మునుగోడు (Munugode) లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన భట్టి విక్రమార్క.. బండి సంజయ్‌ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల్లో విభజన తెచ్చి.. మత విద్వేషాలను రెచ్చగొట్టి.. కులాలు మతాల మధ్యన చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేస్తూ సాగిన యాత్ర.. విషయాత్రే అని అభివర్ణించారు. దేశ ఆస్తులను అమ్ముతూ జాతిని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ (BJP) ని మునుగోడులో అడుగుపెట్టనివ్వకపోవడమే మంచిదన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపిన బీజేపీని ఓడిస్తేనే వాటి ధరలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.
Samayam Telugu Bhatti vikramarka
భట్టి విక్రమార్క


మరోవైపు.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని నమ్మించిన టీఆర్ఎస్.. చివరికి అప్పుల కుప్పగా మార్చేసిందని భట్టి ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు 5 లక్షల కోట్ల అప్పు మిగిలిందన్నారు. ఎన్నికల వాగ్దానాలు హామీలను అమలు చేయని టీఆర్ఎస్ సర్కారుకు మునుగోడు ప్రజలు బుద్ది చెప్పాల్సిందేనన్నారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, మూడు ఎకరాల భూ పంపిణీ, రైతులకు గిట్టుబాటు ధర, ఉదయ సముద్రం, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను పూర్తి చేయని టీఆర్ఎస్ సర్కార్‌కు ఓట్లు వేస్తారా? అని మునుగోడు ప్రజలను ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను దూరం పెట్టి.. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతిని గెలిపిస్తేనే తెలంగాణలో సంక్షేమ రాజ్యం వస్తుందని పేర్కొన్నారు.

ఉద్యోగాలు, ఉపాధి కల్పన, పెండింగ్ ప్రాజెక్టుల కొనసాగింపు, రైతుల ఆత్మగౌరవం, ప్రభుత్వ రంగ వ్యవస్థలు కాపాడటం లాంటి అంశాలు కాంగ్రెస్‌తోనే సాధ్యమని భట్టి స్పష్టం చేశారు. అందరికీ అందుబాటులో ఉండే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.