యాప్నగరం

Bhatti Vikramarka: తన సిబ్బంది కోసం వంట చేసిన భట్టి విక్రమార్క.. పాదయాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్..

Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తన సిబ్బంది కోసం ఆయన వంట చేశారు. గరిటె తిప్పుతూ అల్పాహారం తయారుచేశారు.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 23 Apr 2023, 11:31 am

ప్రధానాంశాలు:

  • భట్టి పాదయాత్రలో ఆసక్తికర సీన్
  • సిబ్బంది కోసం వంట చేసిన సీఎల్పీ నేత
  • అల్పాహారం సిద్దం చేసిన భట్టి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు. ఆయన పాదయాత్ర సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు ఆయన పాదయాత్రలో పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల కోసం కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా భట్టి విక్రమార్క పాదయాత్ర సాగుతోంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు భట్టి పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు కలిసొస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
అయితే పాదయాత్రలో భట్టి విక్రమార్క సందడి చేస్తోన్నారు. శనివారం రాత్రి జోరువాన, ఈదురుగాలులు వీయడంతో పాదయాత్రలో భాగంగా రాత్రి విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయాయి. దీంతో ఆదివారం ఉదయం తన సిబ్బంది, తనతో పాదయాత్రగా నడిచే వారికోసం భట్టి విక్రమార్క అల్పాహారం సిద్దం చేశారు. గరిటె తిప్పుతూ అల్పాహారం రెడీ చేశారు. ఈ సన్నివేశాన్ని అక్కడ ఉన్నవారందరూ ఆసక్తిగా చూశారు. భట్టి వంట చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

భట్టి వంట చేసిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలను భట్టి విక్రమార్క తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తామనే దానిపై ప్రజలకు హామీలు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరుతున్నారు. అయితే పాదయాత్రలో భాగంగా భట్టి చేసే పనులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల పోలం దగ్గర ఆయన స్నానం చేయడం, వేపపుల్లతో దంతాలు తొముకున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. తాజాగా వంట చేసి వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.